అఘా సల్మాన్‌ సంచలన వ్యాఖ్యలు

అఘా సల్మాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ నెల ఫిబ్రవరి19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో అంతా ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్‌ వైస్‌ కెప్టెన్‌ అఘా సల్మాన్‌ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. అలాగే టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇండియా – పాక్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, పాక్‌ రెండు దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. ఇండియా-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే ఆటగాళ్లపై కూడా భారీ ఒత్తిడి ఉంటుంది. కచ్చితంగా గెలిచి తీరాలని ఇరు దేశాల అభిమానులు కూడా కోరుకుంటారు. పైగా ఈ రెండు దేశాలు ఐసీసీ ఈవెంట్స్‌లోనే పాల్గొంటున్నాయి. అయితే తాజాగా ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ గురించి పాక్‌ వైస్‌ కెప్టెన్‌ అఘా సల్మాన్‌ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025‌ను గెలవడమే తమ ప్రాధాన్య లక్ష్యమని పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అఘా సల్మాన్ అన్నారు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఫిబ్రవరి 23న క్రికెట్ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోటీ మాత్రమే కాకుండా, రెండు దేశాల అభిమానుల మధ్య ఉన్న భారీ ఉత్కంఠను కూడా ప్రతిబింబిస్తుంది. ఇండియాపై గెలవడం ముఖ్యమా? లేక ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ప్రధానమా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, తమ దేశం నిర్వహిస్తున్న చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఐసీసీ నిర్వహించడం తమకెంతో స్పెషల్‌ అన్నాడు. లాహోర్‌ గడ్డపై టైటిల్‌ అందుకోవాలన్నదే తమ టీమ్‌ టార్గెట్‌ అన్నారు. తమ కల నెరవేరుతుందని భావిస్తున్నానని,టైటిల్ గెలిచే సత్తా తమకుందని అఘా సల్మాన్ అభిప్రాయపడ్డారు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై అఘా సల్మాన్ వ్యాఖ్యలు

పాకిస్థాన్ వైస్ కెప్టెన్ అఘా సల్మాన్ ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్‌తో జరిగిన చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో మ్యాచ్‌ అంటే ఒత్తిడి ఉండటం సహజమని చెప్పిన అతను, ఒక వేళ మేం ఇండియాపై గెలిచి, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవకపోతే ఆ విజయానికి అర్థం ఉండదు. కానీ, ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిస్తే అది పెద్ద విషయం అవుతుంది అని పేర్కొన్నారు. ఇది క్రికెట్ ప్రేమికుల్లో భారీ చర్చకు దారితీసింది.

భారత అభిమానుల కౌంటర్

అఘా సల్మాన్ వ్యాఖ్యలపై భారత అభిమానులు స్పందిస్తున్నారు. పాకిస్థాన్ జట్టుకు భారత జట్టును ఓడించే సత్తా లేదని కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని, ఈసారి కూడా భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడిస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది.

Related Posts
డ‌బ్ల్యూటీఏ ట్రోఫీ చ‌రిత్ర సృష్టించిన గాఫ్
coco gauff wta

అమెరికా టెన్నిస్ యువ సంచలనం కొకో గాఫ్ తన అద్వితీయ ప్రతిభతో WTA ఫైనల్స్ 2024 ట్రోఫీని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 20 ఏళ్ల గాఫ్, అతి Read more

టీమ్ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఎప్పుడు అంటే..
టీమ్ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఎప్పుడు అంటే..

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమ్ ఇండియా తన ప్ర‌చారాన్ని ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ప్రారంభించనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఆడనున్న భారత జట్టులో శుభ్‌మన్ Read more

ఐసీసీ వన్డేల్లో ఆస్ట్రేలియా హవా
ఐసీసీ వన్డేల్లో ఆస్ట్రేలియా హవా

ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయకూడదని మరోసారి నిరూపితమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెట్టే ముందు ఈ జట్టు గ్రూప్ స్టేజ్‌లో అయినా పోటీ ఇవ్వగలదా? అనుకున్నారు. కానీ ఇంగ్లండ్‌పై Read more

రాజకీయ ప్రముఖులు కొత్త జంటకు అభినందనలు
PV Sindhu Wedding

భారత బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు తన జీవితంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది.హైదరాబాదీ స్టార్ ఆదివారం రాత్రి (డిసెంబర్ 22) వ్యాపారవేత్త వెంకట దత్తసాయితో వివాహబంధంలోకి Read more