Fire : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం .. ఐదుగురు కార్మికులు మృతి

Read Time:  1 min
Fire : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం .. ఐదుగురు కార్మికులు మృతి
FONT SIZE
GET APP

ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రోహా (Amroha)లోని బాణసంచా ఫ్యాక్టరీ (Firecracker factory)లో పేలుడు (Blast) సంభవించింది.

Fire : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం .. ఐదుగురు కార్మికులు మృతి
Fire : బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం .. ఐదుగురు కార్మికులు మృతి

ఈ ఘటనలో ఐదు మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కూలిపోయి, పక్కన ఉన్న ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
పరిస్థితి విషమం
సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అది అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీగా తెలిసింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో శిథిలాలు 300 మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:Jamnagar: జామ్‌నగర్‌లో అక్రమ మత కట్టడం.. బయటపడ్డ విస్తుపో

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.