మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఖండవా జిల్లాలో (In Khandawa district) ఓ హృదయ విదారక ఘటన జరిగింది. మానవత్వమే మాయమైపోయినట్టు అనిపించే ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనకు దారితీస్తోంది.ఒక గిరిజన మహిళపై కొందరు కామాంధులు జంతువుల్లా ప్రవర్తించారు. ఆమెను సామూహికంగా అత్యాచారం (Gang rape) చేసినదే కాక, ఆమె శరీరాన్ని అత్యంత అమానుషంగా హింసించారు.శుక్రవారం రాత్రి, బాధితురాలు తన కుటుంబంతో కలిసి ఒక వివాహానికి వెళ్లింది (Went to the wedding). అదే రాత్రి, ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.శనివారం ఉదయం గ్రామంలో ఓ ఇంటి వెనుక ఆమెను మృదంగా పడి ఉండగా కొందరు మహిళలు గమనించారు. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో వెంటనే కుటుంబానికి సమాచారం ఇచ్చారు.

దారుణ దాడి – ఆవేదనతో చివరిశ్వాస తీసుకుంది
ఆమెను ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యసాయం అందించాలనుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. జరిగిన దాడిని వివరించే ప్రయత్నంలోనే ఆమె ప్రాణాలు విడిచింది.
వైద్యులు చెప్పిన నిజాలు దురదృష్టకరం
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఖండవా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చెప్పిన వివరాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఆమె శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. గర్భాశయం కూడా బయటకు వచ్చినట్టు వైద్యులు తెలిపారు.బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
సామాజికంగా స్పందన – నిందితులకు శిక్షే మార్గం
ఈ దారుణ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర ఆవేదన నెలకొంది. గ్రామస్థులు నిందితులకు కఠినమైన శిక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం.
పోలీసుల స్పందన – త్వరలో న్యాయం జరుగుతుంది
జిల్లా ఏఎస్పీ రాజేశ్ రఘువంశీ మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రాథమికంగా సామూహిక అత్యాచారమే జరిగింది అని తేలింది. ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నాం. త్వరలోనే వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
Read Also : Mahanadu 2025 : టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి