US: అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

Read Time:  1 min
అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్
అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్
FONT SIZE
GET APP

భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ (Sergio Gore) నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన భారత్–అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని సెర్గియో గోర్ పేర్కొన్నారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, ఇండో-పసిఫిక్ భద్రత వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

Read Also: Miguel Diaz-Canel: దేశం కోసం పోరాడతాం అంటూ ట్రంప్‌కు క్యూబా ఘాటు హెచ్చరికలు

US: అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి:  సెర్గియో గోర్
US: అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మోదీ–ట్రంప్ స్నేహబంధం నిజమే

ప్రధాని నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం వాస్తవమని గోర్ వెల్లడించారు. ఈ వ్యక్తిగత స్నేహమే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్–అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడతాయని యూఎస్ రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక సహకారం, పెట్టుబడులు, విద్య, ఇంధనం వంటి రంగాల్లో కొత్త ఒప్పందాలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని సెర్గియో గోర్ వెల్లడించారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు మరింత ఊపునిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచ వేదికపై భారత్ కీలక పాత్ర

ప్రపంచ స్థాయిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో భారత్ సహకారం అవసరమని యూఎస్ రాయబారి తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, శాంతి, స్థిరత్వం విషయంలో రెండు దేశాల ఆలోచనలు ఒకే దిశలో ఉన్నాయని అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.