హైదరాబాద్ : సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదు ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(D.C.M. Bhatti Vikramarka) మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కలిసి జాతర ఏర్పాట్ల పై సమీక్షించి తదు పరి మీడియాతో మాట్లాడారు.
Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..

రూ.260 కోట్లు వెచ్చిస్తున్నాం
ఆ తరువాత అమ్మవారులను దర్శించుకు న్నారు. సమ్మక్కసారలమ్మ(Sammakka Saralamma) జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపం చానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.260 కోట్లు ఖర్చు చేస్తుందని ఇందులో జాతర నిర్వహణ కోసం రూ.150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు గాను రూ. 110 కోట్లు విచ్చిస్తున్నట్టు వివరించారు.
నిధుల ఖర్చు చేయాల్సిన పనులు అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. ఇప్పటికీ జాతర పనులు సగటున 85 శాతం పూర్తి చేశారు, మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
మేడారం పనులు 15 కల్లా పూర్తి ఆదేశించారు.
జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశాం, పూర్తి చేసిన పనులకు 24గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం అధికారులకు తెలిపారు. గతంలో జాతర నిర్వహణకు రూ.75 కోట్లు, రూ.100 కోట్లు ఖర్చూ చేస్తే తమ ప్రభుత్వం రూ. 260 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వీరితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు జాతర నిర్వహణను సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: