Terrorists Enter India: భారత్‌లో చొరబాటుకు పాకిస్థాన్ ఉగ్రవాదుల యత్నం

Read Time:  1 min
Terrorists Enter India: భారత్‌లో చొరబాటుకు పాకిస్థాన్ ఉగ్రవాదుల యత్నం
FONT SIZE
GET APP

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్​పై భారత్ ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor) ను చేపట్టింది. అయితే, ఈ క్రమంలోనే పెద్ద సంఖ్యలో పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్​లోకి పంపించేందుకు ప్రయత్నిచినట్లు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) వెల్లడించింది. మే 8వ తేదీ రాత్రి, జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి చొరబడేందుకు చేసిన 40-50 మంది పాక్ ఉగ్రవాదుల ప్రయత్నాన్ని భారత బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నిరోధించింది. ముందు గానే సమాచారం అందిన నేపథ్యంలో భారత జవాన్లు అప్రమత్తంగా ఉండి, తీవ్ర ప్రతీకారం తీర్చారు. ఇందుకోసం భారీగా షెల్లింగ్‌ కూడా చేపట్టినట్లు బీఎస్‌ఎఫ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎస్‌ మండ్‌ తెలిపారు. మా జవాన్లు వాళ్లకు తీవ్ర స్థాయిలోనే నష్టం కలిగించారు. అయితే, పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు వస్తున్నట్లు మాకు ముందే సమాచారం అందింది. మేం అప్రమత్తమై వారి కోసం కాచుకుని కూర్చొన్నాం. ఆ గ్రూపులో దాదాపు 45-50 మంది వరకు ఉన్నారు. వారు మా వైపునకు వచ్చారు. దీంతో అదును చూసి వారిపై తీవ్రస్థాయిలో దాడులు చేశాం. మేం ఊహించినట్లే తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మేం కాల్పులు జరపడం వల్ల వారు తమ పోస్టులను వదిలేసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. బంకర్లు, ఆయుధాలను ధ్వంసం చేశాం. దాదాపు గంటన్నరలోనే వారికి మేం బుద్ధి చెప్పాం. మరోసారి వస్తే పదింతల శక్తితో వారిని తిప్పికొట్టేందుకు మా జవాన్లు సిద్ధంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి బీఎస్‌ఎఫ్‌కు స్పష్టమైన ఆదేశాలున్నాయి. మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడుతున్నారు. వారిని చూస్తే మాకు గర్వంగా ఉంది’ అని డీఐజీ వెల్లడించారు.

Terrorists Enter India: భారత్‌లో చొరబాటుకు పాకిస్థాన్ ఉగ్రవాదుల యత్నం
Terrorists Enter India: భారత్‌లో చొరబాటుకు పాకిస్థాన్ ఉగ్రవాదుల యత్నం

బీఎస్‌ఎఫ్‌ తీవ్రంగా స్పందించిన విధానం
ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) వేళ జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్‌ తిప్పికొట్టింది. మే 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద జరిగినట్లు బీఎస్ఎఫ్‌ ఎక్స్‌ పోస్టులో వెల్లడించింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి.
నలుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వర్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. సింగ్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు తారసపడి కాల్పులు జరపగా భద్రతా బలగాలు సమర్ధంగా తిప్పికొట్టినట్టు తెలుస్తోంది. ఈ తాజా సంఘటనలు మరోసారి భారత్ ఉగ్రవాదం, చొరబాటుపై నిష్పక్షపాతంగా పోరాడుతున్నదని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. భద్రతా బలగాలు పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల కుట్రలను విఫలంచడంలో నిరంతరం జాగ్రత్తగా, ధైర్యంగా వ్యవహరిస్తున్నాయి. కాల్పులు కొనసాగుతున్నాయనీ, సుమారు నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

Read Also: Pm Modi: దేశ్నోక్ కర్ణిమాత ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.