(Telugu Desam Party)కి ఇది స్పెషల్ టైమ్. ఈ నెల 27వ తేదీ నుంచి కడప జిల్లాలో (In Kadapa district )మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ ఈవెంట్ను ప్రత్యేకంగా చేయాలన్నది పార్టీ లక్ష్యం.ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు తమ ప్రాంతాల్లో శ్రద్ధగా ఈ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు.తమ రాష్ట్రానికి దూరంగా ఉన్న టీడీపీ అభిమానులు కూడా వెనుక పడడం లేదు. విదేశాల్లోని ఎన్నారై టీడీపీ విభాగాలు, ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా మినీ మహానాడు (Mini Mahanadu on the occasion of NTR’s 102nd birth anniversary ) వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నాయి.ఫ్రాంక్ఫర్ట్ నగరంలో మే 24,25 తేదీల్లో మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరగనున్నాయి. జర్మనీలోని ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.వారికి పార్టీ నిండు మద్దతు ఉంది.

ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ అధ్యక్షుడు పవన్ కుర్రా ఈ వేడుకల కోసం ప్రత్యేకంగా మినీ మహానాడు పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గౌతు శిరీష, మరియు గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రధాన అతిథులుగా పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.వారితో పాటు టీడీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి, మినీ మహానాడు సమన్వయకర్తలు శ్రీకాంత్ కుడితిపూడి, శివ తదితరులు కూడా పాల్గొంటారు.ఈ వేడుకలన్నీ పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా టీడీపీ శక్తి చూపించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ సభలు, పార్టీ ప్రజాదరణను మరింత పెంచేలా ఉన్నాయి.ఇలా ఎక్కడున్నా టీడీపీ అభిమానం తగ్గడం లేదు. ప్రతి కార్యక్రమం పార్టీ పునరుద్ధానానికి దోహదపడుతుంది.
Read Also : Bhuma Akhila Priya : ఆర్మీకి 5 నెలల జీతం విరాళంగా ప్రకటించిన అఖిలప్రియ