owner is shocked by what th

పనిమనిషి చేసిన పనికి యజమాని షాక్

కొంతమంది ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తుండడంతో యజమానులు వారికీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అయితే కొంతమంది మాత్రం వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. పనిచేస్తున్న ఇంటికే కన్నంపెట్టడం , దొంగతనాలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ పనిమనిషి చేసిన పని మాత్రం సభ్య సమాజం ఛీ అనుకునేలా చేసింది.

Advertisements

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో గత 8 ఏళ్లుగా వంట చేస్తోంది. నమ్మకస్తురాలే కదా అని ఆమెను ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఇంట్లో కూరగాయలు, వస్తువులు మాయమవుతున్నాయి. దీంతో ఇంటి యజమాని ఫోన్‌లో కెమెరా ఆన్‌ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ కెమెరా లో రికార్డు అయినా దృశ్యాలు చూసి షాక్ అయ్యాడు. పనిమనిషి వంట వండేందుకు వచ్చి.. ఓ పాత్ర తీసుకొని ఆ పాత్రలోనే మూత్రం పోసింది. అదే పాత్రలో పిండి పిసికి రోటీలు చేసింది. ఆ రోటీలనే పిల్లలకు అల్పాహారంగా వడ్డించింది. వీడియోను చూసిన తర్వాత ఇంటి యజమానికి క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్‌స్టేషన్‌(Crossing Public Police Station)లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ తొలుత తనకేం తెలియదని బుకాయించింది. అయితే ఆమెకు వీడియో చూపించి ప్రశ్నించగా తన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ లో జరిగింది.

Related Posts
AAPపై ‘ఛార్జ్ షీట్’ విడుదల చేసిన బిజెపి
anurag thakur

AAPపై 'ఛార్జ్ షీట్' విడుదల చేసిన బిజెపి: ఢిల్లీలో అత్యధిక అవినీతి మంత్రులు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలో నివసించే ప్రజలకు బూటకపు వాగ్దానాలు Read more

మహా కుంభ్‌లో అఖారాల అమృత్ స్నాన్‌ విరమణ
Maha Kumbh Mela 2025

మహా కుంభ్‌లో తొక్కిసలాట కారణంగా అఖారాలు తమ దర్శనీయులు మౌని అమావాస్య అమృత స్నానాన్ని విరమించుకున్నారని అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి Read more

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం
Today is Rekha Gupta swearing in ceremony as the Chief Minister of Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ అనూహ్యంగా ఎంపిక చేసింది. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం.26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం Read more

కూలిన యుద్ధ విమానం.. పైలట్లకు గాయాలు
Crashed fighter plane.. Injuries to the pilots

శివపురి: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. రెండు సీట్లు కలిగిన Read more

×