త్రివేణి సంగమంలో 48 కోట్ల మంది పుణ్యస్నానాలు

త్రివేణి సంగమంలో 48 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న మహాకుంభమేళా లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో కుంభమేళా ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఇవాళ ఉదయం 21 లక్షల మందికిపైగా నదీ స్నానాలు ఆచరించారు.
మాఘ పౌర్ణమి రోజు రెండు కోట్ల మంది భక్తులు
మాఘ పౌర్ణమి సందర్భంగా నిన్న ఒక్కరోజే 2 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తెలిపారు. ఇక ఈ మహాకుంభమేళా ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఇప్పటి వరకూ 48.25 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించారు.

Advertisements
త్రివేణి సంగమంలో 48 కోట్ల మంది పుణ్యస్నానాలు

భక్తులతో క్రిక్కిరిసి త్రివేణి సంగమం
కాగా, పౌష్‌ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది.

గది అద్దె గంటకు రూ 5,000
మహా కుంభమేళాకు రోజూ లక్షలాదిగా భక్తులు తరలివస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలామంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మహా కుంభ్‌ను సందర్శించిన కొందరు భక్తులు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
సంగం వద్దకు వెళ్లేందుకు ప్రైవేట్‌ ఆటోలు, ఇతరవాహనాలు వందల్లో చార్జీలు వసూలు చేస్తున్నారని దినేశ్‌ రాణా అనే భక్తుడు వాపోయాడు. సాధారణ హోటల్‌ ధరలు సైతం ఫైవ్‌ స్టార్‌ రేట్లను మరపిస్తున్నాయి. ఒక్కో గదికి గంటకు రూ. 5,000 చొప్పున వసూలు చేస్తున్నారు.

Related Posts
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి Read more

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు
Curfew imposed in many parts of Manipur

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇటివల జిరిబామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 11 మంది సాయుధ గ్రూపు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే. అయితే Read more

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఎం. ఉదయనిధి స్టాలిన్ చేసిన "సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి" అనే వివాదాస్పద వ్యాఖ్యలపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం Read more

మహా కుంభ్‌లో తొక్కిసలాటకు కారణాలు
stampede

మౌని అమావాస్య రోజున పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతోనే తొక్కిసలాటకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. మౌని అమావాస్య నాడు అమృత స్నాన్ మహా కుంభం Read more

×