flight

వీడియోలో విమానం కూలిపోతున్న దృశ్యాలు

గ్రోజ్నీకి వెళ్తున్న విమానం నిన్న కుప్పకూలడంతో మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసినదే. అయితే అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి కాప్సియన్ సముద్రం పశ్చిమతీరంలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం నిన్న కుప్పకూలడానికి ముందు విమానంలోని ప్రయాణికుడు ఒకరు తీసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. కాస్పియన్ సముద్రం తూర్పుతీరంలోని గ్యాస్ హబ్ అయిన అకటులో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందగా 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
విమానం కూలిపోతుందని తెలిసిన క్షణంలో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఒక ప్రయాణికుడు ‘అల్లాహు అక్బర్’ అంటూ పదేపదే ప్రార్థన చేస్తూ వీడియోను చిత్రీకరించాడు. ఆయన ముఖంలో ఆందోళన కనిపించింది.

Advertisements
flight2


సీట్ల మధ్య మృతదేహాలు
కేబిన్‌లో చిత్రీకరించిన మరో వీడియోలో విమానం సీలింగ్ కుప్పకూలడం, కాపాడాలంటూ ప్రయాణికులు భయంగా కేకలు వేయడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు ప్రయాణికుల మృతదేహాలు సీట్ల మధ్య చిక్కుకోవడం కనిపించింది. విమానం కూలిన తర్వాత ఈ వీడియోను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. కొన్ని ఆర్మ్‌రెస్ట్‌లపై రక్తపు మరకలు కూడా కనిపించాయి.
జాతీయ సంతాపం దినం
కాగా, ఈ ఘటన నుంచి 32 మంది ప్రాణాలతో బయటపడినట్టు అజర్‌బైజాన్ అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంపై అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇహమ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు జాతీయ సంతాపం దినంగా ప్రకటించారు. రష్యాలో జరగనున్న కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్) అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా, పర్యటనను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు.

Related Posts
కోర్టు విచారణకు హాజరైన దక్షిణ కొరియా అధ్యక్షుడు
South Korean president attended the court hearing

రెండు కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ సియోల్ : అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌-యెల్‌ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర Read more

సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ సమావేశం
సేల్స్ ఫోర్స్ సీఈఓ క్లారా షిహ్‌తో మంత్రి నారా లోకేశ్‌ సమావేశం

అమరావతి: ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన లాస్ వెగాస్‌లో జరిగిన సినర్జీ సమ్మిట్‌లో Read more

యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌ పై ఎఫెక్ట్‌
Suspension of USAID.. Effect on India

న్యూయార్క్‌: ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించే యూఎస్‌ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌ భారత్‌పై Read more

China : 4 నెలల్లో 85,000 వీసాలు జారీ చేసింది, వాణిజ్య యుద్ధం వేళ
china

china : ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నప్పటికీ, ఇప్పుడు భారతదేశానికి తన స్నేహ హస్తం చాస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలను Read more

×