ఈ ఓటమి తర్వాత రోహిత్ ఆట, కెప్టెన్సీ రెండింటి మీదే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత ఆరు టెస్టుల్లో భారత జట్టు విజయాన్ని సాధించలేకపోవడం రోహిత్ కెప్టెన్సీపై మరింత ఒత్తిడిని పెంచింది.అడిలైడ్, మెల్బోర్న్లో ఘోర పరాజయాలు ఎదుర్కోవడం, ఇంట్లో న్యూజిలాండ్తో పరాజయం వంటి ఫలితాలు నిరుత్సాహకరంగా మారాయి. గబ్బా టెస్టు వర్షం కారణంగా డ్రా కావడం కూడా భారత్ పోటీకి తగిన స్థాయిలో లేదనే భావనను పెంచింది.రోహిత్ మేల్కొనేంతలో జస్ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టులో భారత్ను విజయ తీరాలకు చేర్చాడు.295 పరుగుల భారీ తేడాతో ఆ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది.రోహిత్ రెండవ బిడ్డ పుట్టిన సందర్భంగా ఆ మ్యాచ్ను మిస్ చేశాడు. అయితే, అడిలైడ్ టెస్టులో తిరిగి జట్టులో చేరిన రోహిత్, ఆ తర్వాత ఐదు ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులే చేయగలిగాడు. సెప్టెంబర్లో బంగ్లాదేశ్ సిరీస్ రోహిత్ 15 ఇన్నింగ్స్లలో కేవలం 164 పరుగులే చేశాడు.

ఇది 10.93 సగటుతో చాలా నిరాశకరమైన ఫలితం.మెల్బోర్న్ టెస్టు రోహిత్ శర్మ చివరి టెస్టుగా మిగిలిపోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ప్రకారం, సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్టు అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్, “కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక సమయం తక్కువగా ఉంది. కానీ మేము సిరీస్ను కోల్పోవడానికి ఇష్టపడడం లేదు. సిడ్నీ టెస్టుకు ముందు ప్రతి చిన్న అంశాన్ని పరిశీలిస్తాం,” అంటూ తెలిపాడు. రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడం భారత క్రికెట్లో కొత్త అధ్యాయానికి దారితీయవచ్చు. ఒక వైపు అతని కెప్టెన్సీపై విమర్శలు, మరోవైపు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే ఆలోచన, ఈ నిర్ణయానికి దారితీసినట్లు అనిపిస్తోంది. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లపై రోహిత్ పూర్తిగా దృష్టి పెట్టవచ్చు.