ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై ఒక వీడియో సందేశాన్ని దేశప్రజలకు విడుదల చేసారు. ఈ ఉదయం మోదీ ఆయన నివాసానికి వెళ్లారు. పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు.
ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఓ ఎంపీగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించేవారని మోదీ చెప్పారు. వీల్చైర్పై పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు.
దేశానికి తీరని లోటు
తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేశారని, ఆ సమయంలో పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక అంశాలపై ఆయనతో తరచూ చర్చించేవాడనని మోదీ చెప్పారు. ఓ రాజనీతిజ్ఞుడిగా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహించే వారని, ప్రతి ఒక్కరికీ అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండేవారని అన్నారు. మన్మోహన్ సింగ్ మృతి ఈ దేశానికి తీరని లోటును మిగిల్చిందని మోదీ పేర్కొన్నారు. సంక్షోభ సమయాలను ధీటుగా ఎదుర్కొని, ఎలా అత్యున్నత శిఖరాలకు చేరవచ్చనే విషయాన్ని మన్మోహన్ సింగ్ జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని, ఈ తరానికి ఆయన ఓ ఆదర్శనీయుడని నివాళి అర్పించారు.

మన్మోహన్ సింగ్ మృతిపై మోదీ సందేశం
Advertisements
Advertisements