బంగారు గనిలోంచి 78 మృతదేహాల వెలికితీత

దక్షిణాఫ్రికాలోని బంగారు గనిలో జరిగిన అక్రమ తవ్వకాల వల్ల అనేకులు మరణించారు. చనిపోయిన వారి మృత దేహాలను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఈ గనిలోంచి 78 మంది కార్మికుల మృత దేహాలను వలంటీర్లు బయటికి తీసుకొచ్చారు. మరో 200 మందిని కాపాడారు. గతేడాది కొంతమంది గని కార్మికులు ఎలాంటి అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా స్టిల్‌ఫొంటైన్ గనిలోకి ప్రవేశించారు. వారి విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న అధికారులు వారికి ఆహారం, నీటి సరఫరాను నిలిపివేశారు. అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అనేక మంది కొన్ని నెలల తరబడి ఈ గని లోపలే నివసిస్తున్నారని కథనాలు వచ్చాయి. అంతకుముందు ఈ గనిలో ఉన్న భయంకరమైన పరిస్థితిని చూపించే వీడియోలు ఆందోళన కలిగించాయి.

గతేడాది దేశవ్యాప్తంగా అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులు ఆపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నారు. ఇటీవల బయటకు వచ్చిన వీడియోల్లోని ఒక దాంట్లో గని లోపల మృతదేహాలను కవర్లలో చుట్టినట్లు కనిపించింది. అయితే ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు. మరో వీడియోలో బక్కచిక్కిన శరీరాలతో కొంతమంది అక్కడ తిరుగుతున్న దృశ్యాలున్నాయి. గనిలో ఉన్న వారిని రక్షించాలని కోర్టు వారం రోజుల క్రితం ఆదేశించడంతో చాలా ఆలస్యంగా సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ సహాయక చర్యలు ప్రారంభించకముందే 1,500 మందికి పైగా కార్మికులు గని నుంచి బయటికి వచ్చారని పోలీసులు చెప్పారు.

దక్షిణాఫ్రికాలో అక్రమంగా గనులు తవ్వేవారిని ‘జామాజామా’ అంటారు. ఈ కార్మికుల మీద ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత వంద మందికిపైగా మరణించినట్లు కథనాలు వచ్చాయి. ఈ గని జోహెన్నెస్‌బర్గ్‌కు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది.అయితే మృతుల సంఖ్యను అధికారులు అధికారికంగా ప్రకటించడంలేదని, ఎంతమంది చనిపోయారో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.

Related Posts
రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర.. కైవ్ లో సమావేశం
రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర.. కైవ్ లో సమావేశం

రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన మూడేళ్లైన సందర్భంగా, ప్రపంచ నాయకులు ఉక్రెయిన్‌కు మద్దతు తెలియజేయడానికి కైవ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటన ఉక్రెయిన్‌కు రాజనీతి, భద్రత, ఆర్థిక పరంగా Read more

‘ఎక్స్’ పై సైబర్ దాడి..ఉక్రెయిన్ ను నిందిస్తున్న మస్క్
స్టార్‌లింక్ ఎంట్రీ అంత ఈజీ కాదు..నిబంధనలు పాటించాలి

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ (ట్విట్టర్) సేవల్లో సోమవారం అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ యూజర్లు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే మూడుసార్లు సేవలు Read more

ట్రంప్ కాబినెట్లో ప్రథమ హిందూ కాంగ్రెస్ సభ్యురాలు
tulsi

డోనాల్డ్ ట్రంప్ తన రెండో టర్మ్ లో తుల్సి ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించుకుంటున్నట్లు ప్రకటించారు. తుల్సి, పూర్వ డెమోక్రాట్ నాయకురాలు మరియు అమెరికాలో Read more

భారత్ కు రానున్న యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్
భారత్ కు రానున్న యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్

యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ వచ్చే వారం భారత పర్యటన కీలక రంగాలలో పెరుగుతున్న కన్వర్జెన్స్‌ను మరింత బలోపేతం చేయడానికి మార్గం సుగమం Read more