Delhi pollution

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

చలికాలం మొదలుకావడంతో ఢిల్లీలో పొగమంచు రోజు రోజుకు ఎక్కుఅవుతుంది. వాతావరణంలో పెరిగిన కాలుష్యంతో కలిపిన ఈ పొగమంచు పర్యావరణానికి ముప్పును కలిగిస్తోంది. దట్టమైన పొగమంచుతో నగరం నిండిపోవడంతో వాహనదారులకు విజిబిలిటీ గణనీయంగా తగ్గింది, దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. విమాన సర్వీసులు, రైళ్లు కూడా ఆలస్యం అవుతున్నాయి.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం.. ఆనంద్ విహార్ ప్రాంతంలో వాయు నాణ్యతా సూచిక (AQI) 473గా నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని తెలిపింది. శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. దీని ఫలితంగా రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటల సమయంలో కూడా సూర్యుడు కనిపించకపోవడం, విజిబిలిటీ సున్నాకి చేరుకోవడం, వాతావరణం మరింత దారుణంగా మారినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితులు ఢిల్లీ విమానాశ్రయం ఆపరేషన్లపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం.. 300కి పైగా విమానాలు ఆలస్యమవుతున్నాయి. మరికొన్ని దారిమళ్లించలసి వస్తుంది. ఢిల్లీలోకి రావాల్సిన 115 విమానాలు, ఢిల్లీలోనుండి బయలుదేరాల్సిన 226 విమానాలు సగటున 17 నుంచి 54 నిమిషాల ఆలస్యంతో నడుస్తున్నాయి. రైళ్లు కూడా ఈ పొగమంచు ప్రభావంతో ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇది ప్రయాణికుల కోసం మరింత ఇబ్బందికరంగా మారింది.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెరిగిన పంట కాల్చే ప్రక్రియ, పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల కాలుష్యం పొగమంచుకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు చలికాలం గాలుల తక్కువ వేగం వల్ల పొగమంచు కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related Posts
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
nirmala sitharaman

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం-1961ను రద్దు చేసి, Read more

బడ్జెట్ లో ఏ రంగానికి ఎంతెంత!
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను Read more

జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
Terror attack on Army vehicle in Jammu and Kashmir

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఉగ్రవాదులు ఇటు ఇటుగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖ్నూర్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై Read more

గుజరాత్‌ ప్రజలు కొత్త విజన్‌ కోసం వేచి చూస్తున్నారు: రాహుల్‌ గాంధీ
People of Gujarat are waiting for a new vision.. Rahul Gandhi

ఆహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *