allu arjun

కోర్టులో కొనసాగుతున్న అల్లు అర్జున్ వాదనలు

నాంపల్లి కోర్టులో శుక్రవారం (నేడు) అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ ఈరోజుతో పూర్తి కాగా.. వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్‌ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.

Advertisements

సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ శుక్రవారం నాంపల్లి కోర్టు కు వర్చువల్‌ లో విధానంలో హాజరు అయినారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలపాల్సి ఉంది.

కాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు.

Related Posts
నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా !
Rythu Bharosa for farmers who have less than 3 acres from today!

రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ హైరదాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. ఈ Read more

ఉద్యోగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది: రేవంత్ రెడ్డి
ఉద్యోగాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం, ఉపాధి కల్పనలో రాష్ట్రం దేశానికి ఒక నమూనాగా మారింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి ఏడాదిలోనే వివిధ Read more

తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు -సీపీ
holi

హోలీ సందర్భంగా ప్రజలు మర్యాదపూర్వకంగా సంబరాలు జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లడం పూర్తిగా నిషేధించబడిందని Read more

ఇక నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘డయల్ 112’
112 dail

తెలంగాణ రాష్ట్రంలో అన్ని అత్యవసర సేవల కోసం ఒకే నంబర్‌ వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రజలు డయల్ 100 (పోలీసు), 108 (ఆరోగ్య అత్యవసర సేవలు), Read more

Advertisements
×