imd warns heavy rains in ap and tamil nadu next four days

అల్పపీడనం ప్రభావం తో ఏపీలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ను వరుస వర్షాలు వదలడం లేదు. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడగ..ఇప్పుడు శీతాకాలంలో కూడా వరుసగా వర్షాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఈ అకాల వర్షాలతో రైతుల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇప్పుడు అల్ప పీడన ప్రభావం తో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కేరళలో విస్తారంగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విప్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి ఆర్.పి.సిసోడియా తెలిపారు. మృత్సకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు కూడా వర్షం సమయంలో పొలాల్లో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపారు. ఈ కారణంగా ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. ఈ నెల 26 నుంచి 3 రోజులు ఏపీ వర్షాలు కురుస్తాయంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి.

Related Posts
హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ నేపథ్యంలో సీఎం రేవంత్ అలర్ట్
hmpv virus

కరోనా వైరస్‌తో ప్రపంచం ఇబ్బంది పడిన తర్వాత, ఇప్పుడు హెచ్‌ఎంపీవీ (HMPV) అనే కొత్త వైరస్ భయాన్ని పెంచుతోంది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్, Read more

మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్‌గా అజ‌య్ కుమార్ భ‌ల్లా
ajay kumar bhalla

గత కొంతకాలంగా మణిపూర్ లో శాంతిభద్రతలు క్షిణించాయి. ఆ రాష్ట్ర సీఎంపై ప్రజలు అసంతృప్తితో వున్నారు. దీంతో ఆ రాష్ట్రముపై కేంద్రం దృష్టిని కేంద్రీకరించింది. తాజాగా కొత్త Read more

తెలంగాణలో ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు
Rice Collection

తెలంగాణలో వర్షాకాలం వరిధాన్యం సేకరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో 53.32 లక్షల టన్నుల ధాన్యం Read more

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
Manmohan Singh dies

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలను భారతదేశంలో తీసుకువచ్చిన మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1991 నుంచి 1996 వరకు అప్పటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *