Technical error.Hyderabad metro trains stopped

సాంకేతిక లోపం..నిలిచినపోయిన హైదరాబాద్‌ మెట్రో రైళ్లు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈరోజు ఉదయం మెట్రోలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో రైలు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నాగోల్-రాయదుర్గం, ఎల్ బీ నగర్-మియాపూర్ రూట్లలో 30 నిమిషాల పాటు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యను గుర్తించారు. దీన్ని సరిచేసేందుకు టెక్నికల్ సిబ్బంది రంగంలోకి దిగారని మెట్రో అధికారులు తెలిపారు.

సోమవారం ఉదయం ఆఫీస్ సమయంలో ఈ సమస్య వచ్చింది. ప్రతి రోజూ సుమారు ఐదున్నర లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మెట్రో సేవలపై ఆధారపడే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.మెట్రో సేవలపై ఆధారపడే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

కాగా, 2022 నవంబర్ 22న కూడా ఇదే రీతిలో హైద్రాబాద్ మెట్రో లో సాంకేతిక సమస్య వచ్చి రైళ్లు నిలిచిపోయాయి. లకీడికపూల్ మెట్రో రైల్వే స్టేషన్ లో రైలు నిలిచిపోయింది. మియాపూర్- ఎల్ బీనగర్, మియాపూర్ మార్గాల్లో అరగంటకు పైగా సేవలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించడంతో రైళ్లు యథావిధిగా నడిచాయి. 2022 మేలో కూడా ఇదే రీతిలో మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ మెట్రో కారిడార్ లో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇదే నెల చివర్లో మూసారాంగ్ రైల్వేస్టేషన్ లో టెక్నికల్ సమస్యతో రైలు ఆగింది. 20 నిమిషాలు స్టేషన్ లోనే ప్రయాణీకులు నిలిచిపోయారు. ఫిబ్రవరిలో కూడా టెక్నికల్ సమస్యలు మెట్రో ప్రయాణీకులను ఇబ్బంది పెట్టాయి. మియాపూర్-ఎల్ బీ నగర్ మార్గంలోని అసెంబ్లీ స్టేషన్ లోనే 20 నిమిషాలకు పైగా రైలు నిలిచిపోయింది.,

Related Posts
Viral : ఒకే ఫ్రేమ్ లో మోడీ , పవన్ , బాబు
pawan modi babu

మరోసారి ముగ్గురు అగ్ర నేతలు కలువడం..ఒకే ఫ్రేమ్ లో ఉండడం అభిమానుల్లో , పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపుతుంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే ప్రధాని మోడీ Read more

నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ
KTR

తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ Read more

రైలు హైజాక్ ఘటన.. బలూచ్ ఆర్మీ వీడియోను విడుదల
రైలు హైజాక్ ఘటన.. బలూచ్ ఆర్మీ వీడియోను విడుదల

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పటికీ బలూచ్ తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉంది. ఇప్పటివరకు 150 మందికి Read more

జయలలిత ఆస్తి రూ.4వేల కోట్లు.. అంతా ప్రభుత్వానికే
jaya

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం నిబంధనల ప్రకారం, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *