AP Tet Exam Result Released

ఏపీలో టెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

అమరావతి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈరోజు (సోమవారం) ఏపీలో గత నెల 3 నుండి 21 వరకు జరిగిన టెట్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు https://cse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా, త్వరలోనే 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

ఇకపోతే..ఏపీలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను ఈరోజు విడుదల చేస్తున్నాం.. అన్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరు కాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ నా శుభాకాంక్షలు” అని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఏపీలో అక్టోబరు 3 నుంచి 21 వరకు 17 రోజల పాటు టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పరీక్షకు సంబంధించి మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 86.28 శాతం మంది పరీక్ష రాశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో జాప్యం జరగడంతో ఫలితాల ప్రకటన నవంబరు 4కి వాయిదా పడింది. దీంతో ఇప్పటికే రెస్పాన్స్‌ షీట్లు, ఫైనల్‌ కీ వెల్లడైన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. టెట్‌ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు వర్తిస్తున్న విషయం తెలిసిందే.

Related Posts
మరోసారి బీజేపీని గెలిపిస్తున్న రాహుల్ గాంధీకి కంగ్రాట్స్: కేటీఆర్
మరోసారి బీజేపీని గెలిపిస్తున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీలో వెలువడుతున్న ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అంతేకాదు , కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. కంగ్రాట్స్‌.ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ Read more

సీఎంఆర్ హాస్టల్‌లో బాత్రూం కెమెరాల కలకలం
సీఎంఆర్ హాస్టల్ లో బాత్రూం కెమెరాల కలకలం1

మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్‌లో దాచిన కెమెరాల వ్యవహారంపై తీవ్ర ఆందోళన చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లో రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థుల నుంచి ఆరోపణలు Read more

తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
Threats to blow up Telangana Secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా Read more

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్‌
Telangana government announced Diwali bonus for Singareni workers

హైరదాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దీపావళి ప్రత్యేక బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా సర్కార్ రూ. 358 కోట్లు విడుదల చేసింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *