Sunny Leone

సన్నీ లియోన్ పేరుతో ప్రభుత్వ లబ్ది

ప్రముఖ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలనెలా రూ.వెయ్యి అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో సన్నీ లియోన్ ను అక్కడి అధికారులు లబ్దిదారుగా ఎంపిక చేశారు. నెలనెలా ఆమె ఖాతాలో రూ. వెయ్యి జమ చేస్తున్నారు. రికార్డులలో సన్నీ లియోన్ పేరు, ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisements

సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ కు సంబంధం ఏంటి.. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటనే సందేహిస్తున్నారా..? అక్కడి అధికారులకు మాత్రం ఎలాంటి సందేహం రాలేదు.
మోసానికి పాల్పడ్డ వీరేంద్ర జోషి
దరఖాస్తులను చూశారో లేదో, లేక తమకు ముట్టాల్సింది ముట్టగానే చకచకా సంతకాలు పెట్టేశారో కానీ సన్నీ లియోన్ పేరు మాత్రం లబ్దిదారుల జాబితాలో చేరింది. నెలనెలా ప్రభుత్వం ఆ ఖాతాలో డబ్బులు కూడా జమచేస్తోంది. బస్తర్ రీజియన్ లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డట్లు తేలింది.

ఛత్తీస్ గఢ్ లోని బీజేపీ సర్కారు వివాహిత మహిళల కోసం ‘మహతారి వందన యోజన’ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వివాహిత స్త్రీలకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకానికి అవినీతి మరక అంటుకుందని ప్రతిపక్షాలు ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
నకిలీ ఖాతా
ఈ క్రమంలోనే ఓ యువకుడు సన్నీ లియోన్ పేరు, ఫొటో లతో బ్యాంకు ఖాతా తెరిచి ఈ పథకానికి దరఖాస్తు చేయగా.. అధికారులు కనీస పరిశీలన కూడా చేయకుండానే ఆమోదం తెలిపారు. కాగా, ఈ పథకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మహతారి వందన యోజన లబ్దిదారుల్లో దాదాపు సగం మంది ఫేక్ అని ఆరోపిస్తోంది.

Related Posts
సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్..వెంటిలేటర్‌పై చికిత్స
Singer Kalpana commits suicide attempt...treated on ventilator

హైదరాబాద్‌: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. బలవన్మరణానికి పాలు పడాల్సిన అవసరం ఆమెకు ఏం వచ్చింది? Read more

Tariffs : వివిధ దేశాలపై ప్ర‌తీకార సుంకాల‌ను ప్ర‌క‌టించిన డొనాల్డ్‌ ట్రంప్
అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు

Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్‌ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ Read more

లోక్‌సభలో బ‌డ్జెట్‌ను వినిపిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి
Union Finance Minister presenting the budget in the Lok Sabha

న్యూఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో Read more

నేడు ఢిల్లీలో బీజేపి కార్యకర్తలతో మోదీ ప్రసంగం
నేడు ఢిల్లీలో బీజేపి కార్యకర్తలతో మోదీ ప్రసంగం

దేశ రాజధానిలో ఫిబ్రవరి 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు, ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ప్రధాని Read more

×