indra sena reddy

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్‌ను నవంబర్ 2023లో 15 రోజుల పాటు ట్యాప్ చేసినట్లు తాజాగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను విచారించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబరు 19, 2023లో ఇంద్రసేన రెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాతే ఆయన ఫోన్ ట్యాప్ చేయడం గమనార్హం.
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి నేతలపైనే నిఘా పెట్టినట్టు భావించారు. అధికారుల దర్యాప్తులో బీజేపీకి సంబంధించి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న ఇంద్రసేనరెడ్డి ఫోన్‌‌ను కూడా రెండు వారాల పాటు ట్యాపింగ్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆయన పీఏను కూడా అధికారులు విచారించారు. ఇంద్రసేన రెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూస్తున్న నేపథ్యంలో.. ఆయనను ఇందులో సాక్షిగా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఇంద్రసేన రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.

Related Posts
తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను చలిగాలులు పట్టి పీడిస్తున్నాయి. గురువారం రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల లాంటి పరిస్థితులు నెలకొనడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు Read more

నాంపల్లి కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి – కేసు వివరాలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలతో చట్టపరమైన సమస్యను ఎదుర్కొన్నారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి – రిజర్వేషన్ కేసు వివరాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశంపై చేసిన వ్యాఖ్యలతో చట్టపరమైన సమస్యను Read more

దివ్యాంగ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
disabilities students

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం తీసుకుంది. ఇది Read more

చిరంజీవిని కలిసిన నాగార్జున
Nagarjuna meet Chiranjeevi

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరిగే ఏఎన్‌ఆర్‌ అవార్డుల వేడుకకు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు నాగార్జున ఈ ఫొటోలను తన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *