chandrababa and vijayasai reddy

విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు స్పందన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని శుక్రవారం ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. శనివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసిన విజయసాయిరెడ్డి రాజీనామా పత్రం సమర్పించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదన్న విజయసాయిరెడ్డి.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిడి లేదని చెప్తున్నారు. వేరే పదవులు, ప్రయోజనాలు కూడా ఆశించడం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే వైసీపీలో అత్యంత కీలక స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఒక్కసారిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, రాజీనామా చేయడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. దావోస్ పర్యటన విశేషాల గురించి చంద్రబాబు నాయుడు.. శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై చంద్రబాబును విలేకర్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తిగత కోపంతో వ్యవస్థలను నాశనం చేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదని విమర్శించారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందంటూ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Related Posts
ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు
earthquake

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా Read more

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..
AP Assembly budget meetings from 24th of this month

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు Read more

వైసీపీ నేతలతో జగన్ భేటీ
వైసీపీ నేతలతో జగన్ భేటీ

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి Read more

ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి
Set up defense cluster in AP.. Lokesh appeals to Rajnath Singh

న్యూఢిల్లీ: రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేశ్ ఈనెల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *