हिन्दी | Epaper
మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

రోహిత్ ను తక్కువ అంచనా వేయొద్దు.

Anusha
రోహిత్ ను తక్కువ అంచనా వేయొద్దు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ – పాకిస్థాన్ మ్యాచ్. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ టీమ్ లు తలపడనున్నాయి. టిక్కెట్లు ఇప్పటికే భారీగా అమ్ముడుపోయాయి, అంటే రేపటి మ్యాచ్ కోసం దుబాయ్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుంది.

పాకిస్థాన్‌కు కీలక సమరం

ఓపెనింగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన ఆతిథ్య పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ అవకాశాలు బలపడతాయి. మరోవైపు, భారత జట్టు బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో టోర్నీని ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులతో తన ఫామ్‌ను ప‌ర్వాలేద‌నిపించాడు, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ భీకరమైన ఫామ్‌ను కొన‌సాగిస్తూ శ‌త‌కం బాదాడు.

 యువ‌రాజ్ సింగ్ వ్యాఖ్య‌లు

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి పరుగులు రావడం మొదలైతే అతన్ని ఆపడం ఎవరి తరమూ కాదని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. రోహిత్‌, కోహ్లీల‌కు ఫామ్‌తో ప‌నిలేద‌ని, వ‌న్డేల్లో వారిద్ద‌రూ మ్యాచ్ విన్న‌ర్లేన‌ని తెలిపాడు. రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నా లేకపోయినా, పరుగులు చేయడం మొదలుపెడితే ప్రత్యర్థి జట్టు చిక్కుల్లో పడక తప్పదు.  నేను ఎల్లప్పుడూ మ్యాచ్ విన్నర్లకు మద్దతు ఇస్తాను. వన్డే క్రికెట్‌లో ముఖ్యంగా వైట్ బాల్ ఫార్మాట్లలో విరాట్ కోహ్లీతో పాటు అతను బ్యాట‌ర్‌గా భారత్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్. అతను 60 బంతుల్లో సెంచరీ సాధించగలడు. కేవలం ఫోర్లే కాదు, సిక్సర్లతోనే పరుగులు రాబట్టగల సామర్థ్యం ఉంది. హుక్ షాట్లు, ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సత్తా ప్రపంచ స్థాయిలో ఉన్న క్రికెటర్లలో రోహిత్ ఒకడు. అతని స్ట్రైక్ రేట్ ఎప్పుడూ 120-140 మధ్యే ఉంటుంది, ఒకసారి సెట్లోకి వస్తే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగలడు.

rohit sharma 696x497

కేవలం ఫోర్లే కాదు సిక్సర్లతోనే ర‌న్స్ రాబ‌ట్టేస్తాడు. షార్ట్ పిచ్ బంతుల‌ను అద్భుతంగా ఆడ‌గ‌ల‌ అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్‌ ఒకడు. అలాగే 145-150 కి.మీ. వేగంతో వ‌చ్చే బంతిని కూడా అల‌వోక‌గా హుక్ చేసి బౌండ‌రీ దాటించే సామర్థ్యం అత‌ని సొంతం.అతని రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడని యువరాజ్ సింగ్ జియో హాట్‌స్టార్‌లో మాట్లాడుతూ అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు (23న) భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సెమీ ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870