हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం

Sharanya
YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం

ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్లాంట్ కోసం నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో భూ సేకరణ (land acquisition) పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను గతంలోనే చెప్పినట్టు రైతుల పక్షాన పోరాటం చేస్తామని మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు. పచ్చటి పొలాలు, మూడు పంటలు పండే భూములు పరిశ్రమల పేరిట కబ్జా చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం
YS Sharmila: కరేడు భూముల విషయంలో సహించేది లేదు: షర్మిల ఆగ్రహం

గ్రామ ప్రజల జీవనాధారమే భూములు

కరేడు గ్రామంలోని పెద్ద శాతం రైతుల జీవనాధారం వ్యవసాయమే. “కరేడు రైతులది బతుకు పోరాటం. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీ (Indosol Solar Company)కి 8,458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం.

వైసీపీ తప్పు – కూటమి ప్రభుత్వం మరింత మోసం-

గత వైసీపీ ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతులు ఇస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా ఊరినే ఖాళీ చేయించేలా భూములు కేటాయించాలని చూడటం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు కరేడు రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం షిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూ సేకరణకు కనీసం గ్రామ సభలు పెట్టలేదు. మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమ వద్దంటున్న రైతుల గోడు వినలేదు. ఇండోసోల్ కంపెనీకి అదనంగా భూములు కేటాయించి, ఊరినే ఖాళీ చేయించాలని చూస్తున్నారు. శాంతియుత ఉద్యమం చేసే కరేడు గ్రామ ప్రజలను నిర్బంధించడాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సన్నద్ధం

ఈ భూ సేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, “ఇది కేవలం భూముల కోసం పోరాటం కాదు ఇది జీవనోపాధికి సంబంధించిన శాస్త్రోక్తమైన పోరాటం” అని షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. రైతుల పక్షాన తామూ ఉద్యమంలో పాల్గొంటామని, ప్రభుత్వం మెత్తపడ్డా, కఠినంగా ఉన్నా వెనక్కి తగ్గేది లేదన్నారు.

షర్మిల ఆగ్రహం

కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే భూసేకరణకు ఇచ్చిన నోటిఫిషన్ ను రద్దు చేయండి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై కరేడు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. గ్రామ సభలు నిర్వహించండి. రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించండి. పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అలా అని రైతుల శవాల మీద అక్రమంగా భూసేకరణ చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు” అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పోలీసుల అరెస్టులు – నిర్భందాలపై ఘాటు స్పందన

కరేడు గ్రామ ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, పోలీసులు వారిని అరెస్ట్ చేయడం, నిర్భంధించడం ప్రజాస్వామ్యానికి అవమానం అని షర్మిల మండిపడ్డారు. రైతుల గొంతును అణగదొక్కే ప్రయత్నాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఉద్యమాన్ని నిషేధించేందుకు పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read hindi also: hindi.vaartha.com

Read also: Perni Nani: అరెస్ట్ కు నేను భయపడను ప్రభుత్వానికి సవాల్ చేసిన పేర్ని నాని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

📢 For Advertisement Booking: 98481 12870