వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు

వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు


డబ్బుకోసం పట్టపగలే ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసి కారులో చిత్రహింసలు పెట్టిన కేసులో వైసీపీ కౌన్సిలర్‌, మరొక వ్యక్తిని పోలీసులు అరె్‌స్టచేశారు. ఈ నెల 5వ తేదీనగుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. పోలీసులు బృందాలుగా ఏర్పడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, వైసీపీకి చెందిన తెనాలి మున్సిపల్‌ కౌన్సిలర్‌ మొఘల్‌ అహ్మద్‌ బేగ్‌తో పాటు షేక్‌ రహమాన్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. తెనాలి త్రీటౌన్‌ సీఐ రమే్‌షబాబు కథనం మేరకు.. వైసీపీ కౌన్సిలర్‌ అహ్మద్‌బేగ్‌ ఈ నెల 5న వార్పురోడ్డులో పనిచేసుకుంటున్న కార్పెంటర్‌ షేక్‌ మస్తాన్‌ వలిని పట్టపగలే కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. తెనాలి నుంచి విజయవాడ వరకూ కారులోనే చితకబాదుతూ డబ్బులు డిమాండ్‌ చేశాడు.

విజయవాడలో చెన్నై నుంచి రావాల్సిన కీలక వ్యక్తి రాలేదన్న కారణంతో వారు డిమాండ్‌ చేసిన డబ్బు ఇవ్వలేనన్న బాధితుడితో రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుని తిరిగి తెనాలిలో వదిలిపెట్టారు. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న అహ్మద్‌ బేగ్‌పై గతంలో రెండు కిడ్నాప్‌ కేసులున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు దౌర్జన్యాలకు పాల్పడడంతో అతనిపై రౌడీషీట్‌ కూడా తెరిచారు. శనివారం మొగల్‌ అహ్మద్‌, రహమాన్‌ తెనాలి వచ్చినట్టు సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్‌ ఇర్ఫాన్‌, షేక్‌ హుమయున్‌ క్రిస్టీ పరారీలో ఉన్నారని వీరిని కూడా అరెస్ట్‌ చేస్తామని సీఐ రమే్‌షబాబు చెప్పారు.

 వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు

తెనాలిలో కిడ్నాప్, హత్యాయత్నం కేసు

వైకాపా కార్పొరేటర్ అహ్మద్ బేగ్ పై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నెల 5న కార్పెంటర్ షేక్ మస్తాన్ ను బలవంతంగా కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

అహ్మద్ బేగ్, రహమాన్ అరెస్టులు

ప్రధాన నిందితుడు అహ్మద్ బేగ్, అతనికి సహకరించిన రహమాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగినప్పటినుండి అహ్మద్ బేగ్ పరారీలో ఉండగా, అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అహ్మద్ బేగ్ పై గతంలో ఉన్న కేసులు

అహ్మద్ బేగ్ పై గతంలో రెండు కిడ్నాప్ కేసులు ఉన్నాయని సీఐ రమేశ్ బాబు తెలిపారు. అతనిపై రౌడీ షీట్ కూడా తెరిచారు.

నిందితులు పరారీలో

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు షేక్ ఇర్ఫాన్, షేక్ హుమయూన్ పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేయాలని సీఐ తెలిపారు.

విజయవాడకు తీసుకెళ్లి డబ్బు డిమాండ్

అహ్మద్ బేగ్, షేక్ మస్తాన్‌ను విజయవాడకు తీసుకెళ్లి పది లక్షలు డిమాండ్ చేసి, తిరిగి తెనాలిలో వదిలిపెట్టారు.

Related Posts
సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో ఊరట
bhargava reddy

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. భార్గవరెడ్డిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. చంద్రబాబు, Read more

మహానంది ఆలయానికి రెండు కోట్ల భారీ విరాళం ఇచ్చిన భక్తుడు
mahanandi

నంద్యాల జిల్లా గోపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ రాజు, మహానంది ఆలయానికి తన అపార భక్తిని చాటుతూ దేవస్థానానికి భారీ విరాళం అందించారు. ఆయన 2 Read more

పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా?
పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉపముఖమంత్రి పదవి చుట్టూ తిరుగుతున్నాయి . ఇన్నాళ్లు పవన్ చేసిన త్యాగాలు , సహాయాలు గుర్తింపు గా పవన్ కు ఉపముఖమంత్రి పదవి ఇచ్చినట్టు Read more

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
TDP candidates who have fil

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి Read more