Hyderabad : నేటి నుంచి 3 రోజులు వైన్స్‌ బంద్‌

Read Time:  1 min
Shocking news for drug addicts.. Wines will be closed tomorrow
Shocking news for drug addicts.. Wines will be closed tomorrow
FONT SIZE
GET APP

హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ రోజు (ఏప్రిల్ 21) సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని అన్ని వైన్స్ షాపులు, బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని పోలీసులు ఆదేశించారు. ఇది ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడటానికి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగమని అధికారులు వెల్లడించారు.

23వ తేదీన హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు

ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీ చేస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. ఎన్నికల సమయంలో మద్యం వాడకం వల్ల ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో, అధికారులు ముందస్తుగా మద్యం అమ్మకాలను నిషేధించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఏప్రిల్ 25వ తేదీన కౌంటింగ్

పోలింగ్ ముగిసిన అనంతరం మద్యం దుకాణాలు మళ్లీ తెరుస్తాయి. అయితే, ఏప్రిల్ 25వ తేదీన కౌంటింగ్ జరగనుండటంతో, ఆ రోజు కూడా మద్యం షాపులను మూసివేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో మద్యం వల్ల జరిగే అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ఇదే ఉత్తమ మార్గమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను గౌరవించి సహకరించాలని వారు కోరారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.