📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ నేటి బంగారం ధర IPL మినీ వేలం.. భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Latest Telugu News: Trump: భారత్ పై ట్రంప్ మళ్లీ సుంకాల బాదుడు

Author Icon By Vanipushpa
Updated: December 9, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చౌకైన విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అమెరికా రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. భారత బియ్యం, కెనడియన్ ఎరువులు సహా అనేక వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను విధించవచ్చనే సంకేతాలిచ్చారు. ఇంతకుముందే అమెరికా రైతులకు 12 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్.. వైట్ హౌస్ సమావేశంలో టారిఫ్స్ మీద పరోక్ష సంకేతాలిచ్చారు. అమెరికా వ్యవసాయ రంగాన్ని రక్షించడానికి అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామని, అన్యాయమైన వాణిజ్య పద్ధతులపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

Read Also: Japan Tsunami: టోహోకు తీరంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు: సునామీ హెచ్చరిక జారీ

Trump-Modi

అమెరికా మార్కెట్లో భారతీయ బియ్యం డంపింగ్

అమెరికా మార్కెట్లో భారతీయ బియ్యం డంపింగ్ జరగుతున్నదని ఆరోపిస్తూ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల నుండి భారీ స్థాయిలో దిగుమతులు రావడం వల్ల అమెరికా బియ్యం ధరలు పడిపోతున్నాయని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. విదేశీ బియ్యం చౌకగా మార్కెట్లోకి రావడంతో దేశీయ రైతుల పంటలు అమ్ముడుపోకుండా నిల్వల్లోనే పేరుకుపోతున్నాయనే వాదనను ట్రంప్ ప్రస్తావించారు. వారు (ఇతర దేశాలు) డంపింగ్ చేయకూడదు… నేను ఇతరుల దగ్గర నుండి విన్నాను. మీరు అలా చేయలేరని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా వ్యవసాయ వర్గాలలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ ఒత్తిడులు

మన దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఇది అవసరం కావచ్చు. మేము దానిని ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను బలోపేతం చేయడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం ఆయన వ్యాఖ్యల ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ద్రవ్యోల్బణ ఒత్తిడులు, వినియోగదారుల ధరల పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. రైతులు పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, ఇంధన ధరల పెరుగుదల, మార్కెట్ అస్థిరతలతో బాధపడుతున్నారు. వీటిలో చాలా వరకు ట్రంప్ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సుంకాలకు ఆధారితమైన వాణిజ్య విధానాల ప్రభావంగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Donald Trump Foreign Policy Global Economy Google News in Telugu import duties India Tariffs International Relations Latest In telugu news Telugu News Today Trade War US–India Trade

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.