Telugu News: Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు

Read Time:  1 min
Rain alert
Rain alert
FONT SIZE
GET APP

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత(Weather Alert) రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి ఆకాశం మబ్బులతో నిండిపోనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడన వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం నవంబర్ 17న ఏర్పడే అవకాశం ఉండగా, దాని ప్రభావంతో తదుపరి 2-3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు వాతావరణ మార్పులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also:  Delhi Blast: పేలుడు ఘటన.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి

ఏపీలో వర్షాలు కురిసే జిల్లాలు

రాష్ట్రంలో పలు జిల్లాలు భారీ వర్షాలకు గురికానున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణలో వర్షాల ప్రభావం

Weather Alert: అల్పపీడన ప్రభావం తెలంగాణపైనా పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి మరియు తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉండటంతో, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్వెటర్లు, మఫ్లర్లు, గ్లౌస్‌లను ఉపయోగించి చల్లగాలికి రక్షణగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.