Rains in Telugu States: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం (Weather) మారిపోయింది. అకాలంగా కురిసిన భారీ వర్షాలు, పిడుగుల కారణంగా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి, బాపట్ల, పల్నాడు మరియు గుంటూరు జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి.
Read also: Telangana Rain updates: రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న అకాల వర్షాలు
Four Killed by Lightning Strikes in Telugu States
మరణించిన వారిలో తెలంగాణలోని వనపర్తి జిల్లా మేడపల్లికి చెందిన మిరప రైతు రాములు (27), ఏపీలోని బాపట్ల జిల్లా రాచూరుకు చెందిన కౌలురైతు వనజ (35) ఉన్నారు. వీరితో పాటు పల్నాడు జిల్లా కొత్త నాగిరెడ్డిపల్లికి చెందిన కూలీ సుబ్బరత్తమ్మ (55), గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి కె.శ్రీనివాసరావు (40) కూడా మృతి చెందారు.
కుప్పకూలిన పంటలు
ఈ వర్షం కారణంగా రైతన్నలకు భారీ నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో పిడుగు పడటంతో సుమారు 300 మేకలు మరణించాయి. చేవెళ్ల, షాద్నగర్ ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతినగా, మిర్చి రైతులు తమ దిగుబడిని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
మరో రెండు రోజులు వర్ష సూచన
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: