తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా ద్రోణి ప్రభావం కొనసాగుతుండగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు భీభత్సంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, భైంసా పట్టణాలు ముంచెత్తుతున్న వర్షాల ప్రభావంతో తీవ్ర గాలివానలు, వృక్షాల నేలకొరుగు, విద్యుత్ స్తంభాల పడిపోయే ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఆదిలాబాద్లో ఆందోళనకర వాతావరణం
జూన్ 9 (సోమవారం) రాత్రి సమయంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ గాలి వాన బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ రోడ్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపడటంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సంజీవ్ నగర్, విద్యానగర్, రవీంద్రనగర్, ఓల్డ్ హౌజింగ్ బోర్ట్ , కేఆర్కే కాలనీలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపల్ సిబ్బంది ప్రధాన రహదారులపై చెట్లను తొలగిస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి కరెంట్ సరఫరాను పునరుద్దరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలోని పలువార్డుల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి వివిధ ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. మున్సిపల్ కమిషనర్, టౌన్ సీఐ పర్యవేక్షణలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేలకొరిగిన చెట్లను తొలగించడం జరిగింది.
నిర్మల్ పట్టణంలో భారీ వర్షం నష్టం
నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో రాత్రి సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరోవైపు వర్షం కారణంలో నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు పలు ఇళ్లల్లో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి.
భైంసాలో పిడుగుల బీభత్సం – ఎలక్ట్రానిక్ పరికరాల నష్టం
భైంసా పట్టణం వర్షాల కారణంగా మరింత తీవ్రంగా ప్రభావితమైంది. వర్షం సమయంలో అక్కడక్కడ పిడుగులు పడటం, గాలులు విరుచుకుపడటం వల్ల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఏపీ నగర్ వంటి ప్రాంతాల్లో పిడుగు బారిన పడి పలు ఇళ్లలోని టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు పూర్తిగా కాలిపోయాయి.
వర్ష బీభత్సం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించింది. మున్సిపల్, విద్యుత్ శాఖలు రంగంలోకి దిగి బాధిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాయి. చెట్లు తొలగింపు, విద్యుత్ లైన్ల మరమ్మతులు, ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.
Read also: Gaddar Award: గద్దర్ అవార్డుల మొమెంటో విడుదల