📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News:Dithwa Cyclone: తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు

Author Icon By Pooja
Updated: November 29, 2025 • 10:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దిత్వా తుపాను(Dithwa Cyclone) దక్షిణ భారతదేశంపై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను కారణంగా అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

Read Also: Dithwa Cyclone:‘దిత్వా’ తుపాను.. ఏపీలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

Dithwa Cyclone: ​​Red alert for Tamil Nadu.. Heavy rains in AP and Telangana too

తుపాను గమనం, తీరానికి చేరే సమయం

ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపిన వివరాల ప్రకారం, ‘దిత్వా’ తుపాను(Dithwa Cyclone) ఈ ఉదయానికి శ్రీలంక తీరాన్ని దాటి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, మరింత బలపడే అవకాశం ఉంది. ఇది నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అంచనా. శని, ఆదివారాల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు వీటి వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

రెడ్ అలర్ట్, ఇతర రాష్ట్రాలపై ప్రభావం

కడలూరు, మైలాదుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ గాలుల వల్ల చెట్లు కూలిపోవడం, మట్టి ఇళ్లు దెబ్బతినడం, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం వంటివి జరగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై కూడా ఉండనుంది. శనివారం కేరళలో అక్కడక్కడా భారీ వర్షాలు కురవనుండగా, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ఆదివారం నాడు కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతుందని తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Ditwa Cyclone Red Alert Google News in Telugu IMD forecast Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.