Bageshwar: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన

Read Time:  1 min
minor earthquake struck Uttarakhand
minor earthquake struck Uttarakhand
FONT SIZE
GET APP

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని భాగేశ్వర్ జిల్లాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 7.25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప (Earth quake) తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం తెలిపింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో తీవ్ర చలి ఉన్నప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Read also: Rain Alert: నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

minor earthquake struck Uttarakhand

minor earthquake struck Uttarakhand

భాగేశ్వర్ జిల్లాతో పాటు రిషికేశ్, హరిద్వార్ ప్రాంతాల్లో కూడా భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించినప్పటికీ, పెద్దగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

భూకంపం వల్ల ఎక్కడైనా నష్టం జరిగిందా అనే విషయంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని సంబంధిత విభాగాలు సూచించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.