తెలుగు రాష్ట్రాల ప్రజలు వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం (Weather Alert) ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు (నైరుతి రుతుపవనాలు) విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (Andhra Pradesh and Telangana) రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వాతావరణ శాఖ ప్రకటనలు:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ శాఖలు చెబుతున్న సమాచారం ప్రకారం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల, ఈశాన్య అరేబియన్ సముద్రం (Northeast Arabian Sea) నుంచి ఉత్తర గుజరాత్, మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ బెంగాల్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 నుండి 5.8 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఇది వాతావరణ మార్పులకు ప్రధాన కారణంగా పనిచేస్తోంది. దీని ప్రభావంతో రాగాల రెండు, మూడు రోజులు తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Weather Alert) కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్ష సూచన కలిగిన జిల్లాలు:
వచ్చే 48 గంటల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో వర్ష సూచన:
అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన హెచ్చరిక ప్రకారం, ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించింది. ఈశాన్య అరేబియా సముద్రం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించింది. ఇప్పుడు ఉత్తర గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్లోని గంగా తీరంలోని ఉత్తర ప్రాంతాలు మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అయితే.. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 -50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది.
ఉత్తర కోస్తా ఆంధ్రా & యానాం:
ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నన్నూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు సూచనలు:
పట్టణ ప్రాంతాల్లో తక్కువస్థాయి ప్రాంతాల్లో వరద నీరు నిలిచే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పని చేస్తున్నవారు రక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రముఖ నగరాల్లో ట్రాఫిక్ జామ్లు, విద్యుత్ అంతరాయాలు తలెత్తే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Jagtial Murder : ఐదేళ్ల బాలికను గొంతు కోసి చంపిన వైనం