బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, అరేబియా సముద్రంలోని మరొక అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విజృంభిస్తున్నాయి. ఈ ప్రభావం ఇంకొన్ని రోజులు కొనసాగనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ (Weather Alert)చేసింది. వచ్చే మూడు రోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
వాతావరణశాఖ ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. వర్షాల తీవ్రత దృష్ట్యా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అధికారులు అలర్ట్ జారీ (Weather Alert) చేశారు.
ఆంధ్రప్రదేశ్ వర్ష సూచన – ఏలూరు, ఉత్తరాంధ్రపై ముప్పు
ఏపీలోని ఏలూరు జిల్లాకు ప్రత్యేకంగా భారీ వర్షాల (Heavy rains) హెచ్చరిక జారీ చేశారు. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గోదావరి నదికి వరదనీరు భారీగా చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ వర్ష పరిస్థితి – ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్ష సూచన ఉంది.
ఇందులో కొమురం భీం జిల్లాలో భారీ వర్షాల కోసం ప్రత్యేక అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ఇది ప్రజలు జాగ్రత్తగా ఉండే సూచనగా భావించాలి.
ప్రజలకు సూచనలు – జాగ్రత్తలు తీసుకోవాలి
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున, ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఉండే వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. రహదారులపై నీటి ప్రవాహం, చెరువులు, వాగులు పొంగిపొర్లే ప్రమాదం ఉండవచ్చు. అందువల్ల ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలి .
Read hindi news: hindi.vaartha.com
Read also: Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?