స్మార్ట్ఫోన్లపై పెరుగుతున్న వ్యామోహం మనుషులను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాణం కంటే ఫోన్ ముఖ్యమని అనుకున్నాడో ఏమో గానీ, ఒక వ్యక్తి తన చేతిలో నుంచి జారిపోయిన ఐఫోన్ కోసం షార్క్లు గుంపులుగా తిరిగే నీళ్లలోకి, దూకి చివరకు ఐఫోన్ను తిరిగి తీసుకున్నాడు. ఈ భయంకరమైన సంఘటన సముద్ర తీరంలో పర్యాటకులు తిరిగే వంతెన వద్ద జరిగింది.
Read also: Floods: అఫ్ఘనిస్థాన్లో భారీ వరదలు 17 మంది మృతి
ఆ వ్యక్తికి ఎలాంటి హాని జరగలేదు
చుట్టూ ఉన్నవారు వద్దంటున్నా వినకుండా చేతిలోంచి జారిన ఫోన్ను తీసుకోవడానికి, ఆ వ్యక్తి షార్క్ల మధ్యలోకి దూకి, ఫోన్ను పట్టుకుని తిరిగి వచ్చేశాడు. అయితే అదృష్టవశాత్తూ, ఆ వ్యక్తికి ఎలాంటి హాని జరగలేదు. బయటకు వచ్చిన వెంటనే చుట్టూ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా, స్పందిస్తున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొబైల్ ఫోన్ల కోసం ఇలాంటి సాహసాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా సెల్ఫీల కోసం, ఫోన్ల కోసం రైల్వే ట్రాక్ల మీదకు వెళ్లడం, కొండల పై నుంచి దూకడం వంటి ఘటనలు మనం చూశాం. కానీ షార్క్లు ఉన్న నీళ్లలోకి దూకడం మాత్రం పీక్ అని చెప్పాలి. టెక్నాలజీ మనిషికి సౌకర్యాన్ని ఇవ్వాలి కానీ.. ఇలా ప్రాణాల మీదకు తీసుకురాకూడదని ఈ వీడియో మనకు హెచ్చరిక.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: