📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

టన్నెల్ లో బా**డీ ని గుర్తించిన సిబ్బంది

Author Icon By Uday Kumar
Updated: March 11, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


SLBC టన్నెల్ రెస్క్యూ

ఆపరేషన్ – క్లిష్టత పెరుగుతున్న పరిస్థితులు

SLBC టన్నెల్ లో బా**డీ ఆపరేషన్ ఎంతకీ కొలిక్కి రావడం లేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంత క్లిష్టమైన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ గతంలో ఎప్పుడూ చూడలేదని ఇందులో పాల్గొన్న అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ పైకప్పు కూలి ఇన్లెట్ నుండి 1385 km వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.

రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా జరిగిన ప్రయత్నాలు

మొదట్లో కార్మికులు బతికి ఉండొచ్చని భావించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. కానీ రోజులు గడిచే కొద్దీ పరిస్థితి స్పష్టమైంది. ఈ ఆపరేషన్ లో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సింగరేణి, మార్కస్ రాడ్ హోల్ మైనర్ సహా వందలాది మంది పాల్గొన్నారు. అయితే, టన్నెల్ కుప్పకూలిన ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగలేదు.

ప్రకృతి అంతరాయంగా మారిన పరిస్థితి

నిమిషానికి వేల లీటర్ల నీటి ఊట, బురద కారణంగా పనులు చాలా ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం పెనిట్రేటింగ్ రాడర్, క్యాడవర్ డాగ్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడర్ గుర్తించిన ప్రదేశాలను D1, D2, D3 ప్రాంతాలుగా విభజించి అధికారులు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల్లో ఆదివారం ఒక మృతదేహాన్ని గుర్తించారు.

గుర్తించిన మృతదేహాలు – అధికారుల ప్రకటన

ఈ మృతదేహం పంజాబ్ కి చెందిన TBM ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. అధికారుల ప్రకారం, ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 25 లక్షల పరిహారం అందించనుంది. ప్రస్తుతం మరికొందరి ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయని సమాచారం.

రెస్క్యూ పనుల్లో ఎదురవుతున్న సమస్యలు

D1, D3 ప్రాంతాల్లో ఎనిమిది అడుగుల లోతు వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇన్ఫో ప్లేట్స్, రాడ్స్ అడ్డుగా ఉండడంతో ప్లాస్మా కట్టర్ సహాయంతో వాటిని తొలగిస్తున్నారు. టన్నెల్ లో బా**డీ విస్తరించడంతో బోరింగ్ మిషన్ మరింత క్లిష్టతను ఎదుర్కొంటోంది.

మిగిలిన మృతదేహాల వెలికితీత

ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో టన్నెల్ బోరింగ్ మిషన్, కటింగ్, డీ వాటరింగ్ పనులు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో శితిలాలను వేగంగా బయటకు పంపుతున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇంకా మిగిలిన మృతదేహాల వెలికితీతకు మరికొన్ని రోజులు పడే అవకాశం ఉంది.

#slbctunnel #SLBCtunnelAccident Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News SLBC Incident Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news tunnel accident Tunnel accident updates tunnel collapse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.