📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు

Author Icon By Uday Kumar
Updated: March 10, 2025 • 6:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందా?

శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందా? అంటే, ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై వివిధ సంస్థలు పలు సర్వేలు నిర్వహించాయి. ఆ నివేదికల ప్రకారం పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇప్పటికే నాలుగు రకాల సర్వేలు పూర్తయ్యాయి. ఈ సర్వేలు ప్రాజెక్టు పునాదుల దగ్గర కదలికలు ఏర్పడ్డాయని స్పష్టం చేస్తున్నాయి.

పునాదుల్లో మార్పులు, పెరుగుతున్న ప్రమాదం

సుమారుగా ప్రాజెక్టు పునాదులకు సమీపంలో 120 మీటర్ల లోతు గుంత ఏర్పడింది . ఈ గుంత క్రమంగా పెరుగుతూ ఉండడంతో పునాదుల కదలికకు ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పగుళ్లు ఏర్పడటంతో, అవి పెరిగితే మరింత ప్రమాదం ఉంటుందని సర్వే బృందాలు హెచ్చరిస్తున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టు అభివృద్ధి చరిత్ర

1963లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు 1981లో ప్రారంభమైంది. మొదట విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించబడిన ఇది కాలక్రమేణా బహుళతక సాధక ప్రాజెక్టుగా మారింది. తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చే విధంగా మార్పులు చేయబడింది.2009 వరదలతో ఇది తీవ్రంగా దెబ్బతింది.

2009లో వచ్చిన విపరీతమైన వరదలు

కృష్ణా నదిలో 2009లో భారీ వరదలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు 10 లక్షల క్యూసిక్ నీటిని తట్టుకునే విధంగా రూపొందించబడినా అదిగమించి 20 లక్షల క్యూసిక్ నీరు ప్రవహించింది . ఈ భారీ వరద ప్రభావం 78 గంటల పాటు కొనసాగింది. దీని ప్రభావం ప్రాజెక్టు పునాదులపై తీవ్రంగా పడింది.

సర్వేలు హెచ్చరించిన ముఖ్యాంశాలు

సుమారు నాలుగు సంస్థలు శ్రీశైలంప్రాజెక్టుపై అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించాయి. ముఖ్యంగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టు భద్రతపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం, రాతి శిలాఫలకాలు పెరుసులుగా మారి ప్రాజెక్టును బలహీనపరుస్తున్నాయి .

ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలన్న నిపుణుల సూచన

ప్రాజెక్టును రక్షించడానికి గతంలో భూమిలో సిమెంట్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. కానీ, అవి కూడా ప్రస్తుతం కదిలిపోయాయి. వేసవిలో నీటిని తగ్గించి మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది . ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రాజెక్టు నష్టపోతే పరిణామాలు ఎంత తీవ్రమైనవి?

శ్రీశైలంప్రాజెక్టు దెబ్బతినితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు నీటిలో మునిగే అవకాశం ఉంది . ప్రజల భద్రత కోసం ప్రభుత్వాలు వెంటనే సమన్వయం చేసుకొని ఈ ప్రాజెక్టును రక్షించే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు . ఆలస్యం జరిగితే గంభీరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

AndhraPradesh Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Srisailam srisailamproject Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.