టాలీవుడ్లో ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే ఆది సాయికుమార్ (Adi Sai kumar), ఈసారి మరో ఆసక్తికరమైన సబ్జెక్ట్తో రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల.. ఏ మిస్టిక్ వరల్డ్’. (Shambhala Movie) యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ జానర్లో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అర్చన అయ్యర్, స్వాసిక్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా, రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also: Peddi Movie: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మేకర్స్ డిసెంబర్ 25న ఈ సినిమాను గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ (Christmas) సందర్భంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతూ, మైమరపింపజేసే అనుభూతిని అందించనుందని చెబుతున్నారు.
ట్రైలర్ విడుదల
ఈ సందర్భంగా మూవీ (Shambhala Movie) నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి, అసురుడికి మధ్య జరిగిన ఒక భీకరయుద్ధం ఈ కథకి ములం అంటూ సాయికుమార్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలయ్యింది.
అనంతరం ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందికి వచ్చి ఒక ఊరిలో పడుతుంది. అయితే అది పడిన తర్వాత నుంచి ఆ ఊరిలో ప్రజలు వింతగా ప్రవర్తిస్తుంటారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి.. ఆ రహస్యాన్ని కనుగొని ప్రజలను హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: