పరీక్షల సమయం దగ్గరపడుతున్న వేళ విద్యార్థుల్లో సహజంగానే ఒత్తిడి, భయం, ఆందోళన పెరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ధైర్యం చెప్పి, సానుకూల దృక్పథాన్ని అలవాటు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే కార్యక్రమం ‘పరీక్షాపే చర్చా’. (Pariksha Pe Charcha) ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం ద్వారా మోదీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో నేరుగా సంభాషించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Read Also: Car Prices: టయోటా కార్ల ధరల పెంపు
ఈ వీడియోను అందరూ చూడాలి
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ, ‘పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను అందరూ చూడాలని ఆయన సూచించారు.కాగా.. ఈ చర్చలో ఢిల్లీ, కోయంబత్తూరు, రాయ్పూర్, గౌహతి నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, పరీక్షల ఒత్తిడిని (Exam Stress) తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: