
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Narasimha Movie) రీసెంట్గా తన 50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మూవీ ‘నరసింహ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1999లో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికీ ఓ సంచలనమే. ‘నా దారి రహదారి’ అంటూ తలైవా చెప్పే డైలాగ్, స్టైల్ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు.
Read Also: Surya: నటుడు సూర్య కొత్త సినిమా ప్రారంభం..
డిసెంబర్ 12న రీరిలీజ్
సిల్వర్ స్క్రీన్పై మరోసారి ఈ సినిమా (Narasimha Movie) ను చూడాలనుకునే వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. రజినీకాంత్ బర్త్ డే సదర్భంగా 2025 డిసెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్గా రీరిలీజ్ చేస్తున్నట్టు సౌందర్య రజినీకాంత్ (Soundarya Rajinikanth) ట్వీట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం 200కుపైగా థియేటర్లలో గ్రాండ్గా స్క్రీనింగ్ అయింది. మళ్లీ పాతికేళ్ల తర్వాత థియేటర్లలోకి రాబోతోంది.
ఈ మూవీకి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, రజనీతో పాటు సౌందర్య, రమ్యకృష్ణ, నాజర్, శివాజీ గణేషన్, నాజర్, అబ్బాస్, ప్రకాష్ రాజ్, మణివణ్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ‘నరసింహ’గా తనదైన స్టైల్, గ్రేస్తో అదరగొట్టారు రజనీ. నీలాంబరిగా పవర్ ఫుల్ నెగిటివ్ రోల్లో రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించగా, విట్టల్ ప్రసాద్, తేనెప్పన్ నిర్మించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: