సోషల్ మీడియా వేదికలు ఈ రోజుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, అనుభవాలను పంచుకునే ప్రధాన వేదికలుగా మారాయి. అయితే అదే సమయంలో ఫేమ్ కోసం, ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడం కోసం కొందరు హద్దులు దాటి ప్రవర్తించడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తాజాగా, బస్సులో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇన్ఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ కాగా.. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ (Kerala) లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.
Read Also: Spain: ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదంపై విజయం: జైశంకర్
కోజికోడ్కు చెందిన 42 ఏళ్ల దీపక్ అనే వ్యక్తిపై వడకరకు చెందిన 35 ఏళ్ల షింజిత ముస్తాఫా అనే యువతి జనవరి 16న సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తుండగా దీపక్ తనను అసభ్యంగా తాకాడని ఆమె ఆరోపించింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయి, లక్షల మందికి చేరింది.ఈ పరిణామంతో దీపక్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
పరారీలో షింజిత
వీడియో వైరల్ అయిన రెండు రోజుల తర్వాత, జనవరి 18న గోవిందపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన కుమారుడి మృతికి షింజిత ముస్తాఫా పెట్టిన వీడియో, దానివల్ల కలిగిన అవమానమే కారణమని దీపక్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు సోమవారం షింజిత ముస్తాఫా పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం షింజిత ముస్తాఫా, పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని నార్త్ జోన్ డీఐజీని ఆదేశించింది. బస్సులోని ఇతర ప్రయాణికులను విచారించి, వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: