📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Reality Check: ఇది 2024… కానీ కుల బహిష్కరణ మాత్రం 1924 మాదిరే!

Author Icon By Uday Kumar
Updated: April 22, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


కుల బహిష్కరణ – నేడు ఇంకా గలుగుతుందా?

కులమా ఇంకా ఎక్కడుంది అంటారు. ఈ రోజుల్లో అందరూ సమానమే కదా అంటారు. కుల బహిష్కరణ గురించి ఎవరైనా మాట్లాడితే “ఇది 2024… డబ్బు తప్ప లోకాన్ని నడిపించేది ఏది లేదు కదా?” అంటారు. కానీ ఆలయాల్లోనికి రానివ్వరు, సామాజిక సంబంధాల్లో దూరం పెడతారు. కుల బహిష్కరణ ఇంకా కళ్లముందే జరుగుతోంది కానీ చాలామందికి కనపడదు.

పిఠాపురంలో దారుణ ఘటన

లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరిగిన ఘటన మన దేశంలో కుల వ్యవస్థ ఎంతగా పాతుకుపోయిందో చెబుతోంది. మల్లం అనే గ్రామంలో ఆధిపత్య కులాల వారు అక్కడి కొందరు దళితులను గ్రామం నుండి బహిష్కరించారు.

కరెంట్ ప్రమాదం – ఆగ్రహానికి కారణం

ఈ నెల 16న మల్లం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో కరెంట్ పని చేయడానికి దళితుడు సురేష్ వెళ్ళాడు. కరెంట్ షాక్‌తో చనిపోయాడు. మృతుడి కుటుంబానికి న్యాయం కావాలని, నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశారు. ఇదే వాళ్లకు కోపానికి కారణమైంది.

నష్టపరిహారం అడిగారంటే తప్పేనా?

ఇక్కడ 2.75 లక్షలు ఇచ్చి సర్దిచేశారు. కానీ అంత సొమ్ము మా వద్ద నుండి ఎలా తీసుకుంటారు? అని మండిపడ్డారు. అందుకే ఆ ఊర్లో ఉన్న దళితులను వెలివేశారు. వారు తినడానికి, కొనడానికి కూడా హక్కులు లేకుండా చేశారు. హోటళ్లు, షాపులు, పనులన్నీ నిషేధించారు.

స్పష్టమైన భౌతిక, సామాజిక దూరం

దళితులతో మిగతా కులాల వారు సంబంధం పెట్టుకోరన్నమాట. ఆ గీత దాటితే తీవ్ర పరిణామాలన్న హెచ్చరికలు కూడా ఇచ్చారు. బాధితులు పోలీసుల వద్దకు వెళ్లారు. ప్రస్తుతానికి పరిస్థితి చక్కబడినట్టే అయినా… అసలు సమస్య ఏమిటంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి?

భావజాలమే వేరే విధంగా ఉంది

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి తక్కువగానే అనిపించినా చుండూరు, కారంచేడు లాంటి ఘోర ఘటనలు మన దగ్గరే జరిగాయి. కాలువల్లో తొక్కించి చంపిన ఘటనలు మన చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో జరిగిన ఘటన మనం పెద్దగా మారలేదని మరోసారి గుర్తుచేస్తోంది.

నిజామాబాద్ ఘటన కూడా ఉదాహరణే

ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఆలయ ప్రవేశం విషయంలో గౌడ మహిళల్ని ఆలయంలోకి రానివ్వలేదు. ఇది తెలంగాణలో కూడా ఇలాంటి విషయాలు కొనసాగుతున్నాయని చెప్పే ఉదాహరణ.

అంతిమంగా – మనమే మారాలి

పట్టణాల్లో కనిపించకపోవచ్చు కానీ పల్లెకు వెళ్ళితే కులం ఆధారంగా వివక్ష స్పష్టంగా ఉంటుంది. మనుషుల్ని కలుపుకుపోవడంలో మొదటి ప్రశ్న “వాడు మన కులానివాడేనా?” అన్నదే కావడం బాధాకరం. ఇది మన నైతికమైన వైఫల్యం.

ఇదే పరిస్థితులుDeputy CM పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరుగుతున్నప్పుడు, ప్రజలు ఆయన స్పందన కోసం ఎదురు చూడడంలో తప్పేముంది?

AndhraPradesh Breaking News in Telugu Caste Expulsion Google news Google News in Telugu kakinada Latest News in Telugu Paper Telugu News Pitapuram Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.