
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరు ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu Movie) పేరుతో అక్టోబర్ 1న విడుదల కానుంది. శ్రీ వేదక్షర మూవీస్ పతాకంపై నిర్మాత రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ధనుష్ (Dhanush) దర్శకుడిగా నాలుగో చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించాడని చెప్పవచ్చు. ఇందులో ప్రధాన పాత్రలో ధనుష్ చెఫ్ పాత్రలో కనిపించనున్నాడు. రుచికరమైన వంటలు, వ్యక్తిత్వంతో కూడిన పాత్రధారణ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కథానాయికగా నిత్యామీనన్ (Nithya Menon) నటించడం సినిమాకు మరో ప్రత్యేకతను చేకూరుస్తోంది.
ట్రైలర్ విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ (Trailer) ను విడుదల చేశారు మేకర్స్. ‘మిషన్లతో అన్నీ చేసేయొచ్చు అంటారు కానీ రుచి అనేది మాత్రం.. మనసు పెడితేనే వస్తుంది. జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు. ఆస్వాదిస్తూ కూడా చేయాలంటూ వచ్చే డైలాగ్లు ఈ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. నిత్యామీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్కిరణ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, సంగీతం: జి.వి.ప్రకాశ్కుమార్, నిర్మాణం: డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిల్మ్స్ ప్రై.లిమిటెడ్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: