ఇటీవల కాలంలో, రోజురోజుకి మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి,హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో చోటు చేసుకున్న హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ యువతి తనకు కాబోయే భర్త చేతిలోనే హత్యకు గురైందన్న వార్త తీవ్ర కలకలం రేపింది.పూర్తి వివరాలు మీకోసం,మొహమ్మది పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మూడా నిజాంపూర్ గ్రామానికి చెందిన మురారి లాల్ తన కుమార్తె నందిని వివాహం నిగోహి జిల్లా షాజహాన్పూర్కు చెందిన తన బావమరిది కుమారుడు జితిన్తో ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. నందిని సాలెంపూర్ కోన్ లఖింపూర్లో అద్దెకు ఉంటూ పాలిటెక్నిక్ చదువుతోంది. జితిన్ ఒక ప్రైవేట్ టాక్సీ నడుపుతూ ఉండేవాడు.
ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత
గత, గురువారం జితిన్ నోయిడా నుండి ఒక ప్రయాణీకుడిని తీసుకువచ్చాడు,తరువాత అతను నందనిని కలిశాడు. శుక్రవారం ఉదయం వారిద్దరూ కారులో ఆలయానికి వెళ్లారు.ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత వారిద్దరూ ఖేరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిరాంచ గ్రామం సమీపంలోని శారదా కాలువ ఒడ్డుకు చేరుకున్నారు. ఇక్కడ జితిన్ (Jithin) నందినితో వేరే ఏ అబ్బాయితోనూ మాట్లాడవద్దని చెప్పాడు. ఆ అమ్మాయి తాను ఎవరితోనూ మాట్లాడనని చెప్పింది. ఈ విషయమై వారిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి జితిన్ను చెంపదెబ్బ కొట్టింది. ఈ క్రమం లోనే, కోపోద్రిక్తుడైన అనంతరం, జితిన్ నందినిని కారులోనే ఊపిరాడకుండా చేసి చంపాడు. మృతదేహాన్ని పొదల్లో పడేసి నిగోహి ఇంటికి వెళ్లిపోయాడు.

కేసు ను ఛేదించిన పోలీసులు
తరువాత తనకు ఏమి తెలియనట్టుగా,ఇంటి నుంచి జితిన్ నందిని తండ్రికి ఫోన్ చేసి, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని, తాను ఆమెతో మాట్లాడలేకపోతున్నానని చెప్పాడు. అంతలోనే నందిని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఒక ప్యానెల్ ద్వారా పోస్ట్మార్టం చేయించారు. పోస్ట్మార్టం నివేదికలో ఆమె మరణానికి కారణం ఊపిరాడకపోవడమేనని పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పుడు, జితిన్పై అనుమానం మరింత పెరిగింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జితిన్ నేరం అంగీకరించాడు.ఒక్కరిని చంపే హక్కు, మనకు లేదు,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. కుటుంబాలలో, ప్రేమ సంబంధాలలో పరస్పర నమ్మకం, అవగాహన పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ఉత్తర ప్రదేశ్ పూర్వపు పేరు ఏమిటి?
ఉత్తర ప్రదేశ్కు బ్రిటీష్ పాలన సమయంలో “ఆగ్రా అవధ్ యునైటెడ్ ప్రావిన్సెస్” అనే పేరు ఉండేది. తరువాత 1935లో దీనిని “యునైటెడ్ ప్రావిన్సెస్”గా సంక్షిప్తం చేశారు.
ఏ రాష్ట్రంలో 75 జిల్లాలు ఉన్నాయి?
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఈ రాష్ట్రంలో 75 జిల్లాలు ఉన్నాయి, అలాగే ఒక తాత్కాలిక జిల్లా కూడా ఉంది.
Read Hindi News : hindi.vaartha.com
Read also : Shashi Tharoor: అందరి చూపు పార్లమెంట్ చర్చల పైనే ..శశిథరూర్ మౌనంపై కొనసాగుతున్న ఉత్కంఠ