ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లా, చిజార్సి టోల్ ప్లాజా వద్ద జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఘటనలో, ఒక మహిళ తన కారుకు ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడంతో టోల్ ఫ్లాజా వద్ద ఉన్న ఉద్యోగి నగదు చెల్లించమని సిబ్బంది అడిగాడు. ఈ మాటకు కోపం తెచ్చుకున్న మహిళ, ఉద్యోగితో వాదన చేసేందుకు బూత్లోకి వెళ్లి ఉద్యోగి చెంపలపై కొట్టడం ప్రారంభించింది. ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ వీడియో:
వీడియోలో ఆ మహిళ అతిగా వ్యవహరిస్తూ, ఉద్యోగిని అసహ్యంగా కొట్టింది. దీనిని చూస్తున్న వాహనదారులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఆమె కోపంతో చెలరేగిపోయింది. ఆమె క్రమంగా ఆ వ్యక్తిని ఎడాపెడా చెంపలపై కొట్టడం, వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఒక యూజర్ అయితే, “4 సెకన్లలో 7 చెంపదెబ్బ? యాక్షన్ సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ ఉండవు!” అని కామెంట్ చేశాడు. మరొకరు, “ఇది కొత్త టోల్ చెల్లింపు పద్ధతా?” అని సరదాగా ప్రశ్నించారు. కొన్ని వ్యాఖ్యలు, “ఆమె ఒక మహిళ కాబట్టి ఆమె ఏదైనా చేయగలదా?” ఈ రోజు ఇది చూస్తానని ఊహించలేదు! అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ సంఘటన అనేక సామాజిక అంశాలను ప్రతిబింబిస్తుంది.
Read also: Drons: అగ్రదేశాల సరసకు భారత్..డ్రోన్లు, క్షిపణులను కూల్చే ఆయుధం