हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Union Bank of India : యూనియన్ బ్యాంక్ పుస్తకాల కొనుగోలుపై పెను దుమారం!

Divya Vani M
Union Bank of India : యూనియన్ బ్యాంక్ పుస్తకాల కొనుగోలుపై పెను దుమారం!

ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ రచించిన ‘ఇండియా@100’ పుస్తకంతో ఈ వివాదం మొదలైంది.ఈ పుస్తకానికి బ్యాంక్ ఇచ్చిన భారీ ఆర్డర్ ఇప్పుడు వివాదాస్పదమైంది.సుమారు రూ.7.25 కోట్ల విలువైన పుస్తకాలు ఓ పబ్లిషింగ్ హౌస్ నుంచి కొనుగోలు చేశారని సమాచారం.బ్యాంక్ 2 లక్షలపేపర్‌ బ్యాక్ కాపీలు, 10,422 హార్డ్‌కవర్ కాపీలను కొనుగోలు చేసింది. ఒక్కో పేపర్‌బ్యాక్ ధర రూ.350, హార్డ్‌కవర్ రూ.597గా ఉంది.ఈ మొత్తం పుస్తకాలను బ్యాంక్ వినియోగదారులు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలకు పంపించాలన్న ఉద్దేశంతో ఆర్డర్ ఇచ్చిందని చెబుతున్నారు.అయితే విడుదలకు ముందే మొత్తం బిల్లులో 50% చెల్లించిందనే విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఒక ఆంగ్ల పుస్తకం పదివేలు కాపీలు అమ్ముకోవడమే కష్టం.

Union Bank of India యూనియన్ బ్యాంక్ పుస్తకాల కొనుగోలుపై పెను దుమారం!
Union Bank of India యూనియన్ బ్యాంక్ పుస్తకాల కొనుగోలుపై పెను దుమారం!

కానీ, రెండు లక్షల కాపీలు ఒక్క బ్యాంక్ కొన్నదంటే సందేహాలు సహజం.18 జోనల్ కార్యాలయాలకు ఒక్కొక్కదానికి 10,000 కాపీల చొప్పున ఆర్డర్ వెళ్లిందని సమాచారం.ఇది నిజంగా వినియోగదారుల కోసం చేశారా? లేక ప్రచారం కోసం వేయబడిన డ్రామానా అన్నదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కృష్ణమూర్తి సుబ్రమణియన్ 2018 నుంచి 2021 వరకు CEAగా పనిచేశారు. తరువాత ఆయనను 2022లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు.అయితే పదవీకాలం పూర్తి కాకముందే కేంద్రం ఆయన్ను రీకాల్ చేసింది. ఈ పుస్తక వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాతే ఇది జరిగిందన్నది ఆసక్తికర అంశం.IMF దీనిపై స్పందిస్తూ, సుబ్రమణియన్ రీకాల్ భారత ప్రభుత్వ నిర్ణయమేనని స్పష్టం చేసింది.ఆయన స్థానంలో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ బాధ్యతలు చేపట్టారు.ఇది ఎంత వాస్తవమో తెలియదు కానీ, టైమింగ్ మాత్రం చర్చకు దారితీస్తోంది.ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రభుత్వ వ్యవస్థల్లో చర్చనీయాంశంగా మారింది. బ్యాంక్ పబ్లిక్ మనీతో ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ కొనుగోలులో నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే దానిపై విచారణకు డిమాండ్ పెరుగుతోంది.

Read Also : India: భారతీయుల ఆయుర్దాయం పెరిగింది…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870