lbnagar wall collapse

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.

ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగాపైనుంచి మట్టిదిబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కూలీని మట్టిదిబ్బల నుంచి బయటకు తీసి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. మట్టి దిబ్బల నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీయగా.. మరో ఇద్దరి డెడ్ బాడీలను బయటకు తీసేందుకు ఫైర్, పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు కూలీలు బిహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.

Advertisements
10504 5 2 2025 12 40 6 1 DSC5687

ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ,
డి ఆర్ డిఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. సెల్లార్ కోసం తీసిన గుంతలు
లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణంకోసం తీసిన గుంతలో పిల్లర్లు నిర్మించి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది . ఫైల్స్ లో కాంక్రెట్ నింపుతుండగాఫై నుంచి మట్టి జారి పడిపోవడంతో కార్మికులు దానికిందచిక్కుకుపోయారు.భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి .క్షత్రగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు . భవన నిర్మాణ పనుల కోసం సూర్యాపేట, బీహార్ నుంచి వచ్చిన కార్మికులువిధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది .ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Related Posts
ఫ్లెక్సీలోన్స్ తెలంగాణ MSME రుణాలలో బలమైన వృద్ధి..
FlexiLoans Expects Strong Growth in Telangana MSME Loans to 2025

హైదరాబాద్‌ : భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్,FlexiLoans.com 2025లో తెలంగాణలో తమ రుణ వితరణలను గణనీయంగా పెంచడానికి ప్రణాళికలను వెల్లడించింది. ముఖ్యంగా, కంపెనీ తెలంగాణలో 2024 Read more

గ్రూప్‌-2 మెయిన్స్‌ యథాతథం : ఏపీపీఎస్సీ
appsc in group 2 mains exams

అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తప్పవంటూ వార్నింగ్ అమరావతి : గ్రూప్-2మెయిన్స్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు Read more

Fishing Ban : ఏపీలో ఈ నెల 15 నుంచి చేపల వేట నిషేధం
Fishing ban in AP from 15th of this month

Fishing Ban : ఏపీలో సముద్ర తీర ప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ … కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా Read more

బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం
jeevan redy budget

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా Read more

Advertisements
×