Pawan Kalyan: పాక్ ను ఎలుకతో భారత్ ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ఆసక్తికర ట్వీట్

Read Time:  1 min
Pawan Kalyan: పాక్ ను ఎలుకతో భారత్ ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ఆసక్తికర ట్వీట్
FONT SIZE
GET APP

భారత్ – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తీవ్ర విమర్శల నడుమ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. పాక్ కుటిల ధోరణిని ఖండిస్తూ, భారతదేశం యొక్క శక్తిని హైలైట్ చేస్తూ ఆయన ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాక్ ను ఎలుకతో, భారత్ ను శేషనాగుతో

పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పాకిస్థాన్‌ను “ఎలుకల”తో పోల్చారు. అదే సమయంలో భారత్‌ను శక్తివంతమైన “శేషనాగం”గా అభివర్ణించారు. దీనికి తమిళ తాత్విక కవి తిరువళ్లువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని ఓ పద్యం. పవన్ కల్యాణ్ దాన్ని ఇలా విమర్శించారు.

పవన్ చేసిన ట్వీట్ 

తమిళ కవి తిరువళ్లువార్ రచించిన తిరుక్కురల్ గ్రంథంలోని పద్యాన్ని పవన్ తన ట్వీట్ లో ప్రస్తావించారు. ‘‘ఎలుకలన్నీ జేరి సముద్రము వలే ఘోషించినప్పటికీ ఏమి హాని జరుగుతుంది..? శేషనాగు ఒక్క హుంకారం చేయగానే అవన్నీ నశిస్తాయి’’ అని చెప్పారు.

S-400 ఎయిర్ డిఫెన్స్ ఫొటోతో ప్రభావవంతమైన సందేశం

ఈ ట్వీట్‌కు పవన్ కల్యాణ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫోటో భారత సైనిక శక్తిని సూచిస్తూ మరింత శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన ఫొటోను జతచేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read also: Jagan : నేడు మురళీనాయక్ కుటుంబానికి జగన్ పరామర్శ

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.