ప్రపంచం మరో భారీ యుద్ధానికి సాక్ష్యం కాబోతోందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్(Iran)ల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యకు దాదాపు సిద్ధమయ్యారని.. ఈ వారాంతంలోనే దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు సీఎన్ఎన్, సీబీఎస్ సంచలన కథనాలను వెలువరించాయి. ఇరాన్తో అణు ఒప్పందం కుదరని పక్షంలో యుద్ధమే మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
13 యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నాయి
అమెరికా తన సైనిక శక్తిని మధ్యప్రాచ్యంలో మునుపెన్నడూ లేనంతగా మోహరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన 13 యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ తో పాటు ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ కూడా ఉన్నాయి. సాధారణంగా ఒకే ప్రాంతంలో రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను ఉంచడం చాలా అరుదు. కానీ ఇప్పుడవి రెండూ అక్కడ ఉండడంతో.. ఇది ఇరాన్పై భారీ స్థాయి దాడులకు అమెరికా సిద్ధమవుతోందనడానికి సంకేతంగా నిలుస్తోందని అంతా భావిస్తున్నారు. వీటికి తోడు ఎఫ్-22 రాప్టర్ స్టెల్త్ ఫైటర్ జెట్లు, ఎఫ్-15, ఎఫ్-16 యుద్ధ విమానాలు గగనతలంలో నిఘాను ముమ్మరం చేశాయి.
Read Also: Madhya Pradesh: పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు
కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం లభించడం లేదు
అమెరికా ఇరాన్పై దాడులు చేయడానికి ఆరు ప్రధాన కారణాలు ఉన్నాయి. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తర్వాత కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం లభించడం లేదు. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను పొట్టన బెట్టుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే అక్కడి ప్రజలకు “సహాయం అందుతుంది” అంటూ హామీ కూడా ఇచ్చారు. మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: