📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

US: భారత్-పాక్ యుద్దాన్ని అపి కోటి మందికి పైగా ప్రాణాలను కాపాడా..ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 21, 2026 • 3:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించగా.. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది నా వలనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో బ్రేకింగ్ న్యూస్ అయింది. అయితే మళ్లీ ఇప్పుడు కూడా ట్రంప్ పాత రాగాన్ని ఆలపించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు అణ్వాయుధాల వినియోగం గురించి కూడా ఆలోచించే స్థితికి వెళ్లాయని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఆ సమయంలో ఎనిమిది యుద్ధ విమానాలు కూల్చివేశారని.. పరిస్థితి అదుపు తప్పితే భారీ విపత్తు తప్పదని తాను భావించానని తెలిపారు. తన జోక్యం వల్లే ఆ ఘర్షణ పెద్ద యుద్ధంగా మారకుండా ఆగిపోయిందని ట్రంప్ స్పష్టం చేశారు.

Read Also: Davos: ఇజ్రాయెల్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

US: భారత్-పాక్ యుద్దాన్ని అపి కోటి మందికి పైగా ప్రాణాలను కాపాడా..ట్రంప్

భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షణ అత్యంత ప్రమాదకరమైనది

తాను అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం పది నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పెద్ద యుద్ధాలను ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ జాబితాలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ సంఘర్షణ అత్యంత ప్రమాదకరమైనదిగా ఆయన అభివర్ణించారు. రెండు దేశాలు అణ్వస్త్రాలతో సన్నద్ధంగా ఉండటంతో.. ఈ యుద్ధం మొదలైతే లక్షలాది కాదు, కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేదని చెప్పుకొచ్చారు. గత ఏడాది వాషింగ్టన్‌కు వచ్చిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనతో మాట్లాడుతూ.. ట్రంప్ జోక్యం వల్ల కనీసం కోటి మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని చెప్పారని అధ్యక్షుడు వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ రెండూ అణ్వాయుధాలు కలిగిన దేశాలే కావడంతో.. ఆ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారేదో ప్రపంచం అర్థం చేసుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. నోబెల్ శాంతి బహుమతి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తన విదేశాంగ విధాన విజయాలు వ్యక్తిగత అవార్డులకంటే ముఖ్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, తాను ఆపిన యుద్ధాల సంఖ్యను ప్రస్తావిస్తూ.. వాటిలో ఒక్కటి కూడా మొదలై ఉంటే లక్షలాది మంది ప్రాణాలు పోయేవని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Donald Trump statement global peace initiatives India Pakistan conflict India Pakistan Relations International Diplomacy Telugu News online Telugu News Today Trump on war prevention

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.