అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్వన్ విమానంలో సాంకేతిక సమస్యతలెత్తింది. ఫలితంగాపైలట్లు విమానాన్ని మేరీలాండ్ లోని సైనిక స్థావరంలో ల్యాండ్చేశారు. ట్రంప్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2026లో పాల్గొనేందుకు విమానంలో బయలుదేరారు. అయితే, వాషింగ్టన్ సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్ర్యూస్ నుంచి విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే పైలెట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు శ్వేతసౌధంప్రెస్ సెక్రటరీ కరోలిన్లివిట్ తెలిపారు.
Read Also: Sunita Williams: అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్
విమానంలో చిన్నస్థాయి ఎలక్ట్రికల్ సమస్య తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి జాయింట్ బేస్ ఆండ్ర్యూస్కు మళ్లించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై వైట్ హౌస్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా స్పందించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఫోర్స్ వన్ సిబ్బంది చిన్న ఎలక్ట్రికల్ సమస్యను గుర్తించారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానం తిరిగి బేస్కు తిరిగి చేరుకుంది. అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం మరో విమానం ద్వారా స్విట్జర్లాండ్కు వెళ్తారు అని వైట్ హౌస్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ పేర్కొన్నారు.
ట్రంప్కు ఎలాంటి ప్రమాదం లేదు
డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026లో పాల్గొనాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ప్రపంచ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణులు పాల్గొనే అత్యంత కీలకమైన అంతర్జాతీయ సదస్సు. ఈ సదస్సులో గ్లోబల్ ఎకానమీ, అంతర్జాతీయ వాణిజ్యం, భద్రత, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. వైట్ హౌస్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వెంటనే స్పందించి, ఇది అత్యవసర పరిస్థితి కాదని, కేవలం ముందస్తు జాగ్రత్త చర్య మాత్రమేనని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: